Bhatti Vikramarka : విద్యుత్ శాఖలో చలనం.. కేబుళ్ల తొలగింపుపై డిప్యూటీ సీఎం ఆదేశాలు
- విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను తొలగించాలని డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
- కేబుల్ వైర్లు యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఆదేశించిన భట్టి
- అనుమతి లేకుండా విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకుంటే కఠిన చర్యలు
- ఏడాది సమయం ఇచ్చినా ఆపరేటర్లు స్పందించలేదు
- ప్రజల ప్రాణాలతో చెలగాటం సరైంది కాదు. -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : హైదరాబాద్ మహానగరంలో పండగ వేళ విషాదం వరుసగా దాడి చేస్తోంది. గత రెండు రోజుల్లోనే కరెంట్ షాక్ల కారణంగా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరొకరు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆదివారం రాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రామంతాపూర్ గోఖుల్నగర్లో నిర్వహించిన రథోత్సవం సమయంలో విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడగా, వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందడంతో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది.
మంగళవారం చాంద్రాయణగుట్ట బండ్లగూడలో మరో విషాదం చోటు చేసుకుంది. 22 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని తరలించే సమయంలో విద్యుత్ తీగలు తగలడంతో ఇద్దరు యువకులు—ధోని (21), వికాస్ (20) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రోజు అంబర్పేటలో కూడా ప్రమాదం జరిగింది. వినాయక మండపానికి పందిరి కడుతున్న సమయంలో కరెంట్ వైర్లు తగలడంతో రామ్ చరణ్ అనే వ్యక్తి షాక్కు గురయ్యాడు. అతడి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
Mumbai Monorail Breaks Down: ముంబైలో రెండు ముక్కలైన మోనోరైలు.. ఇరుక్కుపోయిన 100 మంది!
ఈ వరుస ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి. దీనిపై స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రామంతాపూర్, బండ్లగూడ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల తర్వాత వారు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. వర్షాల సమయంలో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుళ్లను తొలగించే పనులు ప్రారంభించారు. ఉప్పల్, రామంతాపూర్, చిలకానగర్లలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ స్తంభాలపై వేలాడుతున్న కేబుళ్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఆదేశించారు. అనుమతి లేకుండా కనెక్షన్లు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడటం సహించబోమని భట్టి స్పష్టం చేశారు.
JR NTR : ఎన్టీఆర్ కు జరిగిందే మీకూ జరగొచ్చు.. సింగర్ మద్దతు..
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!