RangaReddy:భార్య, అత్త, మామపై దాడి..ఆపై ఆత్మహత్యాయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యం మత్తులో భార్య, అత్త, మామపై దాడి చేసి ఆపై ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ పరిధిలో చోటుచేసుకుంది. భార్య భర్త ల వ్యవహారం చేయి చేసుకునేంత వరకు వెళ్ళింది. అత్తమామలు ప్రశ్నించడంతో ఆగ్రహంతో వారిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో మంజుల, కుమార్ నివాసం వుంటున్నారు. మద్యం సేవించిన కుమార్ భార్యతో గొడవకు దిగాడు. భార్య మంజుల పై అతికిరాతకంగా దాడి చేశాడు. ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా భార్య మంజులా దేవిని భర్త కుమార్ చితకబాదడంతో భార్య మంజులకు తీవ్ర గాయాలయ్యాయి.
Also Read
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
- CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ
- Night Bus Services: హైదరాబాద్లో నైట్ బస్ సర్వీసులు.. సెప్టెంబర్ 1 నుంచి ఈ 6 రూట్లలో ప్రారంభం..
- TGTET In-Service Teachers 2026: అలర్ట్.. టీజీ టెట్-ఇన్-సర్వీస్ టీచర్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
దీంతో మంజులా తమ కుటుంబ సభ్యులకు భర్త దాడి గురించి తెలిపింది. అక్కడకు చేరుకున్న మంజుల తల్లిదండ్రులు తమ కూతురి ఎందుకు కొట్టవ్ అంటూ అల్లుడు కుమార్ ను ప్రశ్నించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కుమార్ నా ఇంటికే వచ్చి నన్నే ప్రశ్నిస్తారా అంటూ అత్త, మామ పై విచక్ఛనా రహితంగా దాడి చేశాడు. వారికి తీవ్ర గాయాలు కావడంతో భయంతో కుమార్ రెండవ అంతస్తు పై నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.
కుమార్ కు తీవ్రగాయాలయ్యాయి. స్థానిక సమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు ఘటన స్థలికి చేరుకుని తీవ్ర గాయాలైన నలుగురిని ఆసుపత్రికి తరలించారు. కుమార్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జయశంకర్ జిల్లాలోని భూపాలపల్లి రాంనగర్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పీకల్లోతు మద్యం మత్తులో భార్యపై భర్త రమేష్ దాడి చేశాడు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న భార్య రాజ్యలక్ష్మిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే పోలీసులు వచ్చేసరికే రమేష్ పరారయ్యాడు. కాగా.. రమేష్కు రాజ్యలక్ష్మి రమేష్కు రెండో భార్య. అయితే నిత్యం మద్యం సేవించి రాజ్యలక్ష్మిని రమేష్ వేధిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
-
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!