Hyderabad: అలిగి పుట్టింటికి వెళ్లిన భార్య.. కఠిన నిర్ణయం తీసుకున్న భర్త..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: దంపతుల మధ్య గొడవలు మామూలే. గొడవలు లేకుండా కాపురం ఉండదని పెద్దలు అంటున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం, మళ్లీ కలిసిపోవడం సమాజంలో ప్రతి ఇంట్లో జరిగే సాధారణ సంఘటన. అసలు అలలు, గిల్లికజ్జాలు లేకుండా సంసారం సుఖంగా ఉండదని కూడా అంటారు. ఎన్ని గొడవలు వచ్చినా 10 నిమిషాలు కూర్చుని మాట్లాడితే సమస్యలు తీరతాయనేది వాస్తవం. ఆ తర్వాత అంతా సాఫీగా సాగిపోతుంది. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని జంటలు విచక్షణ కోల్పోతారు. చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతున్నాయి. చిన్న చిన్న గొడవలనే పెద్ద విషయంగా తీసుకుని క్షణికావేశానికి లోనవుతున్నారు. వీరి గొడవలు పచ్చి సంగతులను నాశనం చేస్తూ.. విడాకుల వరకు వెళ్తున్నాయి. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇటీవల.. ఇంట్లో జరిగిన చిన్న గొడవతో ఓ యువతి భర్తను వదిలి వెళ్లిపోయింది. దీంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్లోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Read also: YS Rajasekhara Reddy: వైఎస్కు గవర్నర్ నివాళి.. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు
Also Read
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
రాజమహేంద్రవరానికి చెందిన రాజారావు కుటుంబం నగరానికి వలస వచ్చి జూబ్లీహిల్స్లో ఉంటోంది. అతని కుమారుడు రామచంద్ర (30) సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రామచంద్రకు 9 నెలల క్రితం వివాహమైంది. కొద్దిరోజులు సాఫీగా సాగిన వీరి జీవితంలో గొడవలు మొదలయ్యాయి. చిన్న గొడవ జరిగినా అది చిలికి చిలికి గాలివాన అయ్యేది. అయితే అది గొడవలు 9 నెలల వరకు కొనసాగుతూనే వచ్చాయి. గొడవలతో విసిగి పోయిన భార్య అతడిని వదిలేసి ఇంటికి వెళ్లిపోయింది. గత మూడు నెలలుగా అత్తాపూర్ పరిధిలోని మారుతీనగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నాడు. భార్యను తనవద్దకు రావాలని కోరేవాడు. అయితే భార్య రాలేనని కలాఖండిగా చెప్పేసింది. దీంతో భార్య వదిలేసి వెళ్లిందని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అటు భార్య దగ్గర లేక, ఇట్టు మనస్తాపంతో తీవ్ర ఆలోచనతో గడపలేకపోయాడు. చావే సరణ్యమని భావించి నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎందుకు తన భార్య వెళ్లిపోయిందని, రామచంద్ర చివరిగా ఎవరితో మాట్లాడు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ప్రెగ్నెన్సీలో వాంతులు.. పరిష్కారానికి చిట్కాలు
తాజావార్తలు
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?