Dowry Harassment: పాలు విరిగాయి అని ప్రాణం పోయేలా కొట్టారు.. గదిలో బంధించి దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dowry Harassment: పాలు విరిగాయన్న నెపంతో అత్తింటివారు ఆ కోడలి పై తమ ప్రతాపం చూపారు. అదనపు కట్నం తెమ్మంటూ రాచిరంపాన పెట్టారు. ఒళ్ళంతా వాతలు తేలేలా మెటల్ పైపుతో మూడ్రోజుల పాటు కొట్టి నరకం చూపారు. ఈ అమానవీయమైన ఘటన మధురానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో జరిగింది.
Read also: KTR Tweet: ఎంత అవమానం!! కేటీఆర్ ట్విట్ వైరల్
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
సనత్ నగర్ అల్లాఉద్దీన్ కోఠికు చెందిన హీనా బేగం(28)ను ఎల్లారెడ్డిగూడకు చెందిన కారు డ్రైవర్ అక్మల్ హుస్సేన్(42) తో నాలుగేళ్ళ క్రితం పెద్దలు సమక్షంలో ఘనంగా వివాహం చేశారు. కట్నకానుకల కింద రూ.2 లక్షల కట్నం, నాలుగున్నర తులాల బంగారం, ఇతర లాంఛనాలు ఇచ్చి పెండ్లి చేశారు. అప్పటికే అక్మల్ హుస్సేన్ కు మెదటి పెండ్లి పెటాకులైన విషయం దాచిపెట్టారు. తర్వాత పెళ్లి విషయం తెల్సినా హీనా బేగం సర్దుకుని కాపురం చేయసాగింది. కొన్నాళ్ళ పాటు వీరి కాపురం సజావుగా సాగటంతో ఇద్దరు సంతానం కలిగారు. అయితే కొద్దిరోజుల పెళ్ళైనప్పటి నుంచి భర్త అక్మల్ హుస్సేన్, అత్త అఫ్రోజ్ బేగం, ఆడపడుచు సోని, మరిధిలు తబ్రేజ్, అయ్యూబ్లు కలిసి ఆమెని శారీరకంగా, మానసికంగా హింసించారు. మీ పుట్టింటి నుంచి అదనపు కట్నం తేలాలని ఆమె చీటికీమాటికి కొట్టేవారు. బిడ్డ కాపురం బాగు పడుతుందేమోననే ఆశతో అప్పుసొప్పు చేసి మళ్లీ రూ.2.50 లక్షలు వరకు అత్తింటి వారికి ముట్టజెప్పారు.
Read also: Nude Photo Case: స్కానింగ్ సెంటర్ లో న్యూడ్ ఫోటోల కేసు.. మరో బడా ఆసుపత్రిలో..
అయినా ఆ కట్న పిశాచుల ధనదాహం తీరలేదు. వేధింపుల్ని భరిస్తూ.. భర్తతో మార్పు వస్తుందేమోనని ఆశగా ఎదురుచూసేది ఆ ఇల్లాలు. కాపురాన్ని కాలదన్ను కోలేక బిడ్డల కోసం అన్నీ భరిస్తూ వచ్చింది ఆ ఇల్లాలు. కాగా అత్తింట్లో పొయ్యి పై పాలు వేడి చేసి మరిగించేటప్పుడు.. పాలు విరిగిపోయాయి.. పాపిష్టిదానా పాలు విరగొట్టావంటూ ఒక్కసారిగా భర్త, అత్త, ఆడపుడుచు, మరిదిలు అంతా కిలిస హీనా పై మెటల్ పైపుతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారుత ఇంట్లో మూడ్రోజుల పాటు నిర్బందించి మెటల్ పైపుతో ఆమెని చావబాదారు. ఒళ్ళంతా గాయాలతో కమిలిపోయింది. హీనా స్పృహ కోల్పోయింది. దీంతో హీనా తల్లిదండ్రులకు కాల్ చేశారు. మీ కూతురు చనిపోయిందంటూ ఫోన్ చేసి చెప్పారు. షాక్ తిన్న హీనా కుటుంబం పురుగున వచ్చి చూడగా అపస్మారకస్థితిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కుమార్తెను చూసి గుండెలవిసేలా రోదించారు. అత్తింటివారి దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు హీనాను చికిత్స కోసం అమీర్ పేట ప్రభుత్వ దవాఖానాకి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.
Monsoon: నేటి నుంచి వర్షాకాలం ప్రారంభమైనట్టే.. నేడు,రేపు పొడివాతావరణం
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!