Medak:దారుణం.. మహిళపై ఇంటి ఓనర్ కొడుకు అత్యాచారయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజంలో మానవత్వ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఆడపిల్ల ఒంటరిగా కనపడినా.. వాళ్లకి ముందూవెనుకా ఎవరూ లేరని తెలిసినా.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తున్నారు. అబలలపై అన్యాయాలు జరిగిన ప్రతిసారీ.. సమాజంలో మార్పు రావాలని.. వాటిని వ్యతిరేకిస్తూ ఎన్ని కథనాలు రాసినా, బహిరంగ చర్చలు, సమావేశాలు జరిగినా.. మళ్లీ ప్రతి రోజు ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
సభ్య సమాజం తలదించుకునేలా చాలా మంది దారుణాలకు ఒడిగడుతున్నారు. ఒకరు తప్పు చేస్తే మరొకరు అండగా నిలవాల్సిన వారే అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నియమ నిబంధనాలను తీసుకువచ్చినా.. ఈ లైంగిక దాడులు ఆగడం లేదు.
Also Read
- CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
- CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
- విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
- Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ లో కిరాయి ఉంటున్న మహిళపై లైంగిక దాడి చేసే ప్రయత్నం చేశాడు. మెదక్ పాపన్నపేటలో నిద్రిస్తున్న మహిళపై అత్యాచారయత్నం చేశాడు ఇంటి ఓనర్ కొడుకు. రాత్రి పిల్లలతో కలిసి ఇంట్లో పడుకున్న మహిళ.. భర్త డాబా పైన పడుకున్నాడని తలుపులు తీసి పడుకుంది. అయితే.. అర్థరాత్రి ఇంటి యజమాని కొడుకు ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. మహిళ కేకలు వేయడంతో పారిపోయాడు ఇంటి ఓనర్ కొడుకు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా.. ఒంటరిగా ఉన్న మహిళపై వీఆర్ఏ అత్యాచారయత్నం చేసిన ఘటన 18 Mar 2022న వరంగల్ జిల్లాలో జరిగింది. భార్య కేకలు విని అడ్డువచ్చిన భర్తని వీఆర్ఏ తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యాడు. రాయపర్తి మండలం కొండాపురం శివారు తండాకి చెందిన దంపతులు గ్రామంలో బిర్యానీ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. రాత్రి బిర్యాని సెంటర్కి వచ్చిన కొండాపురానికి చెందిన వీఆర్ఏ గాదె అశోక్ హోటల్ నిర్వాహకురాలిపై అత్యాచారానికి యత్నించాడు.
బలవంతంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించగా ఆమె కేకలు వేయడంతో వెంటనే భర్త అడ్డుపడ్డాడు. పెనుగులాడుకుంటున్న క్రమంలో బాధితురాలి భర్త వేలు నిందితుడి నోట్లో పడడంతో తెగిపడేలా కొరికేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు.
మృగాళ్లు రెచ్చిపోతున్నారు… నిత్యం ఏదో ఒకచోట మహిళలపై ఆకృత్యాలకు తెగబడుతున్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తేనే ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట పడుతుందని మహిళా సంఘాల నేతలంటున్నారు.
తాజావార్తలు
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!