COVID 19: కరోనా సోకినవారిని పట్టేస్తున్న జాగిలాలు….!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.. కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి టెస్ట్ చేసే.. వైరస్ సోకిందా? లేదా? అని నిర్ధారిస్తున్నారు.. మరికొందరిలో ఎలాంటి లక్షణాలు లేకున్నా పాజిటివ్గా తేలుతుంది.. అయితే, ఇప్పుడు జాగిలాలను రంగంలోకి దింపారు… హత్య కేసులు, ఇతర కేసుల్లో నిందితుల గుర్తింపు కోసం జాగిలాలను ఉపయోగించడం చూశాం.. సెక్యూరిటీ చెక్స్లోనూ జాగిలాలను ఉపయోగిస్తుంటారు.. ఇప్పుడు కోవిడ్ సోకినవారిని గుర్తించేందుకు కూడా వాటిని ఉపయోగిస్తున్నారు.. ఫిన్లాండ్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి పరిశోధకులు- నాలుగు జాగిలాలకు కరోనా వైరస్ను గుర్తించడంలో శిక్షణ ఇచ్చారు. 420 మంది వాలంటీర్ల స్కిన్ స్వాబ్ నమూనాలను వాటి ముందు ఉంచగా… ఈ నాలుగు జాగిలాలు వారిలో 114 మంది కరోనా బాధితులను పట్టేశాయి.. మిగతా 306 మంది పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ ఫలితం రావడం విశేషంగా చెప్పుకోవాలి.
Read Also: TDP: ఏపీలో ఉన్న బీసీలు.. బీసీలు కాదా..?
Also Read
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
ఆ జాగిలాలకు ఏడు దఫాల శిక్షణ తర్వాత ఈ స్వాబ్ నమూనాలను అవి 92 శాతం కచ్చితత్వంతో గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు. 28 మంది బాధితులకు ఎలాంటి లక్షణాలు లేకపోయినా, వారిని సైతం జాగిలాలు గుర్తించాయంటే.. అవి ఏ స్థాయిలో పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక్క కేసులో మాత్రం ఇవి తప్పుగా నెగెటివ్ అని గుర్తించాయని, రెండు నమూనాల వాసన సరిగా చూడలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2020 సెప్టెంబరు- 2021 ఏప్రిల్ మధ్య హెల్సింకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చిన ప్రయాణికులకు పీసీఆర్ పరీక్షలతో పాటు జాగిలాల ముందు ఆ నమూనాలను ఉంచగా… 98 శాతం కచ్చితత్వంతో వాటిని నెగెటివ్/పాజిటివ్గా గుర్తించినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. మొత్తంగా.. కోవిడ్ బాధితులను గుర్తించడంలోనూ జాగిలాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
తాజావార్తలు
-
PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
-
Crude Oil Price Today: బ్యారెల్కు 100 డాలర్లకు చేరువలో ముడి చమురు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఎంత?
-
Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
-
CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి