Summer Record: వేడి సెగలు తప్పవంటున్న నిపుణులు.. ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Summer Record: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వేడి వాతావరణం నెలకొంది. గత రెండు నెలలుగా ఈ రాష్ట్రాల్లో అత్యంత లోటు వర్షపాతం కొనసాగుతోందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. విపరీతమైన వర్షాలు, అధిక వేడిమితో కూడిన ఎల్ నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. అంటే వచ్చే రెండు నెలలు ఎండలు ఉండకపోవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి.
Read also: Pawan Kalyan: పిఠాపురంలో ప్రచారానికి సిద్ధమైన జనసేనాని.. అభ్యర్థిగా తొలిసారి పర్యటన
Also Read
- Haribabu Murder: ‘ఎస్.. నేనే చంపేశా’.. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
అధిక ఉష్ణోగ్రతలతో తేమశాతం పెరగడంతో జనం వడదెబ్బకు గురవుతున్నారు. దీంతో పాటు పలు ప్రాంతాల్లో వీస్తున్న వేడి గాలులు మరింత ఇబ్బందిగా మారాయని నిపుణులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటికి వెళ్లకూడదని, ఆరు బయట భారీ శారీరక శ్రమ చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత ఎక్కువ నీరు తాగాలని, శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలని వివరించారు. జిమ్లు మరియు అవుట్డోర్లలో వ్యాయామం చేసే వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. డీహైడ్రేషన్ మరియు ఇతర పరిస్థితులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీలైనంత వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిదని చెబుతున్నారు. వృద్ధులు, పిల్లలు బయటకు రాకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు.
Read also: Balayya : రికార్డులు కొత్తేమి కాదు.. సృష్టించాలన్న నేనే.. తిరగరాయాలన్న నేనే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుడి ప్రభంజనం కొనసాగుతోంది. ఏపీ వాతావరణం దావానలంలా మారిపోయింది. ఇప్పటికే విపరీతమైన వేడి, చెమటతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో నిన్న వడగళ్ల వానలు కురిశాయి. రాయలసీమలో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Asus: Asus Vivobook లైనప్లో కొత్త ల్యాప్టాప్లు.. S14, S16, 14 Flip, S14 Flip, Vivobook 16 లాంచ్
-
The Paradise : రూ.100 కోట్లు పలికిన ప్యారడైజ్ థియేట్రికల్ రైట్స్.. కానీ రికవరీ పరిస్థితి ఏంటి?
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల దావూద్ వివాదంపై మౌనం వీడిన మందాకిని
-
Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్ను భయపెడుతున్న లెక్కలు!
ట్రెండింగ్
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..