Summer Record: వేడి సెగలు తప్పవంటున్న నిపుణులు.. ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Summer Record: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వేడి వాతావరణం నెలకొంది. గత రెండు నెలలుగా ఈ రాష్ట్రాల్లో అత్యంత లోటు వర్షపాతం కొనసాగుతోందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. విపరీతమైన వర్షాలు, అధిక వేడిమితో కూడిన ఎల్ నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. అంటే వచ్చే రెండు నెలలు ఎండలు ఉండకపోవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి.
Read also: Pawan Kalyan: పిఠాపురంలో ప్రచారానికి సిద్ధమైన జనసేనాని.. అభ్యర్థిగా తొలిసారి పర్యటన
Also Read
అధిక ఉష్ణోగ్రతలతో తేమశాతం పెరగడంతో జనం వడదెబ్బకు గురవుతున్నారు. దీంతో పాటు పలు ప్రాంతాల్లో వీస్తున్న వేడి గాలులు మరింత ఇబ్బందిగా మారాయని నిపుణులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటికి వెళ్లకూడదని, ఆరు బయట భారీ శారీరక శ్రమ చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత ఎక్కువ నీరు తాగాలని, శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలని వివరించారు. జిమ్లు మరియు అవుట్డోర్లలో వ్యాయామం చేసే వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. డీహైడ్రేషన్ మరియు ఇతర పరిస్థితులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వీలైనంత వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిదని చెబుతున్నారు. వృద్ధులు, పిల్లలు బయటకు రాకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు.
Read also: Balayya : రికార్డులు కొత్తేమి కాదు.. సృష్టించాలన్న నేనే.. తిరగరాయాలన్న నేనే..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుడి ప్రభంజనం కొనసాగుతోంది. ఏపీ వాతావరణం దావానలంలా మారిపోయింది. ఇప్పటికే విపరీతమైన వేడి, చెమటతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో నిన్న వడగళ్ల వానలు కురిశాయి. రాయలసీమలో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Saturday Horoscope: ఆగస్టు 29 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్న్యూస్..
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!