Narayanpet: పిల్లలు చనిపోతే కానీ స్పందించరా.. మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్..
- మాగనూర్ జడ్పీ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం కల్తీపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం..
- వారం వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించిన హైకోర్టు..
- పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని ప్రశ్నించిన హైకోర్టు..
- అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమన్న హైకోర్టు..
- ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదన్న హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narayanpet: ఫుట్ పాయిజన్ తో గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థి శైలజ మృతి చెందిన ఘటన మరువక ముందే.. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. మాగనూర్ ఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించండం లేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై హైకోర్టు ఇవాళ విచారించింది. దీనిపై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ భోజనం వికటిస్తోందని తెలిపారు. వారం వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా అని హైకోర్టు సీరియస్ అయ్యింది. ఇది చాలా సీరియస్ అంశమని సీజే తెలిపారు.
పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని హైకోర్టు ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదని మండిపడింది. ఈ సంఘటనపై వారంలో కౌంటర్ దాఖలు చేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రంలో ఉండే అధికారిని సంప్రదించి వివరాలు సేకరించడానికి వారం వ్యవధి ఎందుకుని సీజే ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా? అని ప్రశ్నించింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారని తెలిపింది. అధికారులకు కూడా పిల్లలున్నారు కదా అని తెలిపింది. అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించింది. భోజన విరామం తర్వాత ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏఏజీ అందిస్తామన్నారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
Read also: V. Hanumantha Rao: వి.హనుమంతరావు కారును ఢీ కొట్టిన మరో వాహనం.. సీసీ ఫుటేజ్ లో దృశ్యాలు..
నారాయణపేట జిల్లా మాగనూరులో ఫుట్ పాయిజన్కు గురైన 20 మంది విద్యార్థులు మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు మహబూబ్ నగర్ ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బయట చిరుతిల్లు తిండి తినడం వల్లనే నని ఫుట్పాయిజన్ అయ్యిందని మాఘనూరు అధికారుల అంటున్నారు. కాగా.. బాధిత విద్యార్థులు మాట్లాడుతూ ఉడకని అన్నం, వంకాయ ఆలుగడ్డ పెట్టారని చెబుతున్నారు. వారు తాగిన నీరు కూడా సరిగా లేదని తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులు ఎవరూ బయట చిరుతిల్లు తినలేదని అంటున్నారు.
మేమందరం పాఠశాల భోజనం తినండం వల్లే అస్వస్థలకు గురయ్యామని అన్నారు. మరోవైపు మాగనూరు వైద్యం పొందుతున్న విద్యార్థులను కలిసేందుకు వెళుతున్న విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్కూల్ వద్ద పోలీలసు 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. మాగనూరు గ్రామాన్ని పోలీసులు దిగ్బంధంలో తీసుకున్నారు. ఎవరికిని మాగనూరులోకి అనుమతించడం లేదు. మాగనూరు ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ సిక్త పట్నాయక్ సందర్శించారు. వంట గది, కూరగాయలు, వంట సామాగ్రి పరిశీలించారు. వంట చేస్తున్న సిబ్బందితో వివరాలు సేకరించారు.
Nirmal: నిర్మల్ లో ఉద్రిక్తత.. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!