Telangana Heavy Rain: నేడు, రేపు భారీ వర్షాలు.. శ్రీశైలం 2, నాగార్జున సాగర్ 8 గేట్లు ఎత్తివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Heavy Rain: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ 12 జిల్లాల్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి, పెద్దపల్లి, భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబబ్ నగర్, నాగర్ కర్నూల్ 7 సెం.మీలకు పైగా వర్షపాతం నమోదు కావొచ్చని తెలిపింది. హైదరాబాద్ తో పాటు కొన్ని జిల్లాల్లోనూ మరో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.
ఇక ఏపీ ఈనెల 1 నుంచి 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 17.69MM అధిక వర్షపాతం నమోదైంది. 8 జిల్లాల్లో 50 నుంచి 90% అధిక వర్షం కురిసింది. బాపట్ల జిల్లాలో ఏకంగా 90.4%, శ్రీకాకుళం జిల్లాలో 70%, విజయనగరంలో 62.2%, మన్యంలో 61.2%, ఏలూరులో 66.4%, గుంటూరులో 64.5%, పల్నాడులో 50.4% అధిక వానలు కురిశాయి. పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా, పెన్నా బేసిన్లలోని రిజర్వాయర్లలోకి నీరు సమృద్ధిగా చేరుతోంది.
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
శ్రీశైలం 2, నాగార్జున సాగర్ 8 గేట్లు ఎత్తివేత
ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం 2 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కు నీరు వదులుతున్నారు. దీంతో సాగర్కు 1,12,803 క్యూసెక్కుల ఇన్ఫ్రా వస్తోంది. సాగర్ 8 గేట్లు ఎత్తి 1,22,354 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులుగా ఉంది.
Read also: Munugode Bypoll: బంపరాఫర్స్.. ఫ్లైట్ టికెట్లు.. రూ70 కోట్ల మద్యం.. ఎక్కడో తెలుసా?
ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, పరిసర ప్రాంతాలలో తుఫాను ప్రభావం ఉండటంతో.. దీని ప్రభావం రాయలసీమ, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్ వెంబడి ద్రోణి ప్రవహిస్తుంది. ఈ ప్రాంతంలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ప్రకటించింది. ఈ తుపాను ప్రభావంతో పశ్చిమ, ఉత్తర తెలంగాణలో ఈరోజు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలోని దక్షిణ, తూర్పు జిల్లాల వైపు కదులుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
భారీ వర్షాల హెచ్చరికల కారణంగా తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు.
ఒడిశా- బీహార్లోని కొన్ని ప్రాంతాలలో కూడా బుధవారం వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Left Parties Sabha: నాడు ఎన్టీఆర్ .. నేడు కేసీఆర్.. కామ్రేడ్స్ ఉమ్మడి సభ
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!