Left Parties Sabha: నాడు ఎన్టీఆర్ .. నేడు కేసీఆర్.. కామ్రేడ్స్ ఉమ్మడి సభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా రాజకీయాలు వేడెక్కాయి. మునుగోడు నియోజక వర్గంలో టీఆర్ఎస్ తర్వాత కమ్యూనిస్టు పార్టీలు సంస్థాగతంగా బలంగా ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్కు కమ్యూనిస్టులు మద్దతు ఇస్తున్నారు.ఆనాడు కమ్యూనిస్టులనట ఎన్టీఆర్ ఏకం చేస్తే.. నేడు కమ్యూనిస్టులను కేసీఆర్ ఏకం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి ఉభయ కమ్యూనిస్టుల బహిరంగ సభ ఏర్పాటుచేశారు. టీఆర్ఎస్ కోసం వామపక్షాలు ఏకం అయ్యాయి. మరి భవిష్యత్తులో కూడా తెలంగాణలో కమ్యూనిస్టులు ఒకే మాట ఒకేబాటగా ముందుకు వెళతారా?
తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి కమ్యూనిస్టు ఐక్యతారాగం పలుకుతున్నారు. ఇప్పుడు మునుగోడు ఎన్నికల కోసం, టీఆర్ఎస్ గెలుపు కోసం కమ్యూనిస్టులు ఒకటిగా ప్రజల ముందుకెళుతున్నారు. ఈనెల11వ తేదీన ఉభయ కమ్యూనిస్టుల సభ జరగనుంది. ఉప ఎన్నిక ఎందుకోసం వచ్చింది అనేది వివరించడమే లక్ష్యంగా కమ్యూనిస్టుల బహిరంగ సభ జరుగుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కామ్రేడ్లు కలిసి వస్తే టీఆర్ఎస్ విజయం ఖాయం అనే ధీమాతోనే కేసీఆర్ వారిని కలిపారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గతంలోనూ అనేకమార్లు రెండుపార్టీలు కలిసి రావాలని అంతా భావించారు. కానీ ఇప్పుడు కాలం కలిసి వచ్చినట్టుంది. టీఆర్ఎస్కు మద్దతు ప్రకటన, దానికి దారితీసిన పరిస్థితులను కేడర్కు చెప్పాలనేది ఇరు పార్టీల ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు.
Also Read
- Telangana High Court: "సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా".. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- Mahabubabad: ఇద్దరు పిల్లల తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. ఫోన్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్..
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
Read Also: Jio 5G: రాకెట్ స్పీడుతో జియో 5జీ.. దగ్గరలో లేని ప్రత్యర్థి కంపెనీలు
టీఆర్ఎస్ ని గెలిపించేందుకు కామ్రేడ్లు కలిసి వచ్చారు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదం ఎక్కడైనా గోడల మీద కనిపిస్తే , ఆ నినాదంపై ఛలోక్తులు వినబడేవి. ప్రపంచ కార్మికులారా ఏకంకండి… కాదు.. భారతదేశంలో కమ్యూనిస్టులు ఏకం కండి అంటూ కార్టూన్లు, కథనాలు అనేకం వచ్చాయి. ఇప్పుడు అదే దిశగా కమ్యూనిస్టులు ఒకే మాట, ఒకే బాట అన్నట్టుగా కలవనున్నాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఉమ్మడి ఆంధ్రపదేశ్లో 1980 దశకంలో ఎన్టీఆర్ ఏకం చేశారు. 1985 నాటి వరకూ కమ్యూనిస్టు పార్టీలు ఎవరిగోల వారిదే అన్నట్టుగా ఉండేవారు.. కొట్లాటలకి, ఘర్షణలకి కేంద్ర బిందువుగా వుండేవారు. సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన అనేకమంది ఆ ఘర్షణల్లో బలయిపోయిన ఘటనలు అనేకం వున్నాయి.
ప్రధానంగా నల్లగొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ ప్రాంతాలు, ఖమ్మం జిల్లాలో పాలేరు, ఖమ్మం, మధిర, వైరా ప్రాంతాలలో నిరంతరం కొట్లాటలు వుండేవి. అనేకమంది రెండుపార్టీలకు చెందినవారు చనిపోయారు. గృహదహనాలు కూడా జరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో వామపక్షాల ఐక్యత జరిగింది. ఆనాటి టిడిపి అధినేత ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాదెండ్ల భాస్కరరావు ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత జరిగిన పరిణామాలు వామపక్షాలు టీడీపీకి మద్దతు ఇచ్చాయి. దీంతో అప్పటినుంచి వామపక్షాలు టీడీపీతో కలిసి పోటీచేయడం ప్రారంభించాయి. గ్రామాల్లో లెఫ్ట్ పార్టీల మధ్య విభేదాలు తగ్గిపోయాయి. అయితే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఘటనలు.. ఆనాడు ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు తో వామపక్షాలు సఖ్యతతో వుండేవి. తర్వాత కాంగ్రెస్ వామపక్షాలు కలిసి పనిచేశాయి.
కట్ చేస్తే.. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణకు మద్దతు ఇచ్చింది సీపీఎం.. కానీ సీపీఐ మద్దతివ్వలేదు. అప్పటినుంచి రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. టీఆర్ఎస్ తో కూడా రెండుపార్టీలు కలవలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా వామపక్షాలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా ముందుకుసాగాయి. సీపీఐ ఒక పార్టీకి మద్దతుగా నిలిస్తే.. సీపీఎం మరో పార్టీ పంచన చేరేది. తెలంగాణ వచ్చాక 2014లో సీపీఎం స్వతంత్రంగా పోటీచేసింది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే వైసీపీతో సీపీఎం పొత్తు పెట్టుకుంది. 2018 ఎన్నికలు వచ్చేసరికి సీపీఎం బీఎల్ఎఫ్ తో కలిసి పోటీచేసింది. అయితే రెండు ఎన్నికల్లో సీపీఎంకి ఏమాత్రం అచ్చిరాలేదు. ఇకపోతే సీపీఐ మాత్రం 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీచేసింది. ఈరెండు ఎన్నికల్లో వామపక్షాలు విడివిడిగానే పోటీలో వున్నాయి. 2019 పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం సీపీఐ, సీపీఎం పార్టీలు కలిసి పోటీచేశాయి. కానీ వారిలో అంతా ఐక్యత కనిపించలేదు. ఆనాడు కూడా ఉమ్మడి సభలు జరిగినా.. తూతూమంత్రంగా జరిగిన సభలుగా మాత్రమే అవి మిగిలిపోయాయి.
ఇప్పుడు మునుగోడులో టీఆర్ఎస్ ని గెలిపించేందుకు వామపక్షాలు గట్టిగా కృషిచేస్తున్నాయి. తామే పోటీచేసిన విధంగానే భావించి ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్నాయి. రెండుపార్టీల ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో భారీ బహిరంగసభ జరగనుంది. సీపీఎం, సీపీఐ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం ఈసభలో పాల్గొంటారు. ఈ ఉమ్మడి వ్యూహం మునుగోడు వరకేనా? భవిష్యత్తులోనూ కొనసాగిస్తారా అనేది మునుగోడు ఫలితం తర్వాత తేలనుంది.
Read Also: Jio 5G: రాకెట్ స్పీడుతో జియో 5జీ.. దగ్గరలో లేని ప్రత్యర్థి కంపెనీలు
(మా ప్రతినిధి భూపాల్ సౌజన్యంతో…)
తాజావార్తలు
-
Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్తో కొత్త స్మార్ట్ టీవీ
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!