NTV Telugu Site icon

MLC Kavitha: నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ ష్కాంలో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌ను నేడు, రేపు (సోమ, మంగళవారా)ల్లో ఢిల్లీ హైకోర్టు విచారించనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయడాన్ని, అంతేకాకుండా.. కవితను అరెస్ట్ చేసేందుకు ట్రయల్ కోర్టు అనుమతిని, సీబీఐకి కస్టడీ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సింగిల్ బెంచ్ గత శుక్రవారం విచారించింది. మద్యం కుంభకోణంలో 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, మహిళా చట్టం ప్రకారం ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు. కాగా, కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ కౌంటర్ దాఖలు చేయగా, సీబీఐ సమయం కోరింది. ఈ నేపథ్యంలో నేడు వాదనలు వింటామని జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది.

Read also: Nehru Zoological Park: సరికొత్త రికార్డ్‌.. 30వేల మందితో సందడిగా నెహ్రూ జూపార్క్‌

కవిత వాదనలు సోమవారం, ఈడీ, సీబీఐ వాదనలు మంగళవారం పూర్తి చేయాలని ఆదేశించింది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయగా.. ఆదివారం రాత్రి 10 గంటల లోపు ఈ-మెయిల్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని సీబీఐకి స్పష్టం చేసింది. దీంతో బెయిల్ పిటిషన్లపై న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ ధర్మాసనం మరోసారి వాదనలు విననుంది. కాగా, మద్యం కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈడీ అరెస్టు చేసింది. 16వ తేదీన రూస్ అవెన్యూ ఆమెను కోర్టులో హాజరుపరిచింది. తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. మరోవైపు కుమారుడికి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను రూస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. మార్చి 26న ట్రయల్ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించగా.. తీహార్ జైలులో ట్రయల్ ఖైదీగా కవిత దాదాపు రెండు నెలల పాటు ఉన్నారు.
Nehru Zoological Park: సరికొత్త రికార్డ్‌.. 30వేల మందితో సందడిగా నెహ్రూ జూపార్క్‌