Harish Rao : తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చుతారా.?
- బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీష్రావు
- తెలంగాణ ఏర్పాటు పాకిస్తాన్ విభజనతో పోల్చిన తేజస్వి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
- పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలి
- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దశాబ్దాల పోరాటం -హరీష్రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన తేజస్వి సూర్య వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దశాబ్దాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువత త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను ఒక విద్వేషపూరిత విభజనతో పోల్చడం అమరుల త్యాగాలను అవమానించడమేనని హరీష్ రావు ధ్వజమెత్తారు.
PM Modi: ఇది చరిత్ర సృష్టించే సమయం.. మహిళా రిజర్వేషన్లకు ప్రధాని మద్దతు..
Also Read
- Warangal Politics: కొండా సురేఖ బర్తరఫ్తో సైలెంట్ మోడ్లోకి వరంగల్ రాజకీయాలు.. గుండు సుధారాణి పదవితో కొత్త అలక!
- CM Revanth Reddy: కొడంగల్లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
- Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
- OTR: రాజగోపాల్ రెడ్డి రాజన్న రాగం ఎందుకు వినిపిస్తున్నారు..?
తెలంగాణ ఆవిర్భావం రాజ్యాంగబద్ధంగా జరిగిందని, నేడు ఈ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్గా నిలవడాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోందని హరీష్ రావు విమర్శించారు. “ఇండియా-పాకిస్థాన్ విభజన లాంటిదే తెలంగాణ ఏర్పాటు అయితే, ఆనాడు బీజేపీ పార్లమెంట్లో విభజన బిల్లుకు ఎందుకు మద్దతు తెలిపింది?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రధాని మోడీ గతంలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై విషం చిమ్మారని, నేడు తేజస్వి సూర్య అదే బాటలో నడుస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం స్పందించి తన వైఖరిని స్పష్టం చేయాలని, లేదంటే ఇది ఆ పార్టీ అధికారిక ధోరణిగానే భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Delimitation Bill: మీ టికెట్లు అన్నీ ముస్లిం మహిళలకు ఇవ్వండి.. అఖిలేష్కు అమిత్ షా కౌంటర్..
రాష్ట్రం నుంచి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, అలాగే కాంగ్రెస్ ఎంపీలు తేజస్వి సూర్య అనుచిత వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా ఉండటం సిగ్గుచేటని హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ పేరుతో ఓట్లు అడిగి గెలిచిన వీరు, ఢిల్లీ పెద్దల ముందు వంగి రాష్ట్ర గౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. “బీఆర్ఎస్ ఎంపీలే లోక్సభలో ఉండి ఉంటే తేజస్వి సూర్య సంగతి తేల్చేవారు” అని పేర్కొన్న ఆయన, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న ఎంపీలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ అంటే ఒక పోరాట గాథ అని, స్వాభిమానానికి ప్రతీక అని హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర హక్కులు, ఆత్మగౌరవంపై దాడి చేసే శక్తులను తెలంగాణ ప్రజలు ఎన్నడూ క్షమించరని హెచ్చరించారు. తెలంగాణను అవమానించే ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టి సమాధానం ఇస్తామని, త్యాగాల చరిత్రను అగౌరవపరిస్తే సహించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Shruti Haasan: AI డీప్ఫేక్లపై శృతి హాసన్కు హైకోర్టు రక్షణ.. కీలక ఆదేశాలు!
-
Redmi 17 5G: రెడ్ మీ 17 5G భారత్లో లాంచ్.. 7900mAh బ్యాటరీ.. 50MP కెమెరా!.. ధర, ఫీచర్లు ఇవే
-
Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
-
Warangal Politics: కొండా సురేఖ బర్తరఫ్తో సైలెంట్ మోడ్లోకి వరంగల్ రాజకీయాలు.. గుండు సుధారాణి పదవితో కొత్త అలక!
-
MLA Bonda Uma: సిద్ధార్థకు అవకాశం ఇవ్వండి.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బోండా ప్రత్యేక విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!