Harish Rao : ఇలాగైతే… సీఎం మాటలు నీటి మూటలేనా?
- రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు
- గ్రీన్ చానెల్ నిధులు విడుదల చేస్తామన్న సీఎం మాటలు నీటి మూటలేనా?
- కమీషన్లు రావనే గురుకులకు నిధులు కేటాయించడం లేదా?
- హామీలతో మభ్యపెట్టడం, ఆ తర్వాత మాట మార్చడం ఇదే రేవంత్ సిద్ధాంతం : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలోని గురుకులాలపై కొనసాగుతున్న సమస్యలను తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా, ముఖ్యమంత్రి గ్రీన్ చానెల్ ద్వారా నిధులు విడుదల చేస్తామని చెప్పిన మాటలు నీటి మూటలాగా మారాయని, కేటాయించిన నిధులు సిబ్బంది వేతనాలు, వసతి గృహాల మరమ్మతులు, అత్యవసర పనుల కోసం సరైన విధంగా ఉపయోగించబడలేదని అన్నారు.
హరీష్ రావు మాట్లాడుతూ.. కమీషన్లు రావనే గురుకులకు నిధులు కేటాయించడం లేదా? మీ 22 నెలల పాలనలో గురుకులాల ఖ్యాతి దిగజార్చబడిందన్నారు. సమస్యలతో నిత్యం విద్యార్థులు రోడ్డెక్కడం, నిత్యవసరాలు అందకపోవడం ప్రస్తుత ప్రభుత్వ నిర్వాహణపై తీవ్ర చిహ్నంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. రాష్ట్రంలోని 1024 గురుకులాలకు కేవలం 60 కోట్లు మాత్రమే కేటాయించడాన్ని సిగ్గుచేటుగా చూస్తున్నామన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డికి ఆరున్నర లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఉన్న గురుకులాలకు కనీసం 100 కోట్లు కేటాయించే మనసు రాలేదా? అని ప్రశ్నించారు.
Also Read
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
Cough Syrup Tragedy: దగ్గు సిరప్ కేసులో సంచలన నిజాలు.. కమీషన్కి కక్కుర్తి పడ్డ వైద్యుడు..!
మొదటి దృష్ట్యా, అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాల అద్దె బకాయిలు, పెండింగ్లో ఉన్న తాత్కాలిక సిబ్బంది వేతనాలు, మెస్ చార్జీలు, స్టిచ్చింగ్, కాస్మొటిక్ ఛార్జీలు ఇంకా చెల్లించని విషయాలను ఆయన డిమాండ్ చేశారు. గణితం ఉపాధ్యాయులు నియమించడంలో ఆలస్యం, విద్యార్థుల నిరసనలు, పురుగులన్నం సమస్యలు ఇలా కొనసాగుతున్నందుకు ప్రభుత్వం పట్టింపు వహించాలన్నారు. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, ఏదో చేస్తున్నట్లు ప్రచారం చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావు అని ఆయన వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాలను విష వలయాలుగా మార్చారు, అపఖ్యాతిని మూటగట్టారని ఆయన ఆరోపించారు. గ్రీన్ చానెల్ ద్వారా బిల్లులు, వసతి గృహాలకు నిధులు చెల్లిస్తామని చెప్పిన మాటలు ఎప్పుడైతే కార్యరూపం దాల్చుతాయి? అని హరీష్ రావు ప్రశ్నించారు. గురుకులాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికై అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
Employees: ఉద్యోగులకు దీపావళి బహుమతి.. బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..
తాజావార్తలు
-
Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
-
Petrol-Diesel: పెట్రోల్లో ఇథనాలు, డీజిల్లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
-
Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
-
Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!