Harish Rao : ఇలాగైతే… సీఎం మాటలు నీటి మూటలేనా?
- రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు
- గ్రీన్ చానెల్ నిధులు విడుదల చేస్తామన్న సీఎం మాటలు నీటి మూటలేనా?
- కమీషన్లు రావనే గురుకులకు నిధులు కేటాయించడం లేదా?
- హామీలతో మభ్యపెట్టడం, ఆ తర్వాత మాట మార్చడం ఇదే రేవంత్ సిద్ధాంతం : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలోని గురుకులాలపై కొనసాగుతున్న సమస్యలను తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా, ముఖ్యమంత్రి గ్రీన్ చానెల్ ద్వారా నిధులు విడుదల చేస్తామని చెప్పిన మాటలు నీటి మూటలాగా మారాయని, కేటాయించిన నిధులు సిబ్బంది వేతనాలు, వసతి గృహాల మరమ్మతులు, అత్యవసర పనుల కోసం సరైన విధంగా ఉపయోగించబడలేదని అన్నారు.
హరీష్ రావు మాట్లాడుతూ.. కమీషన్లు రావనే గురుకులకు నిధులు కేటాయించడం లేదా? మీ 22 నెలల పాలనలో గురుకులాల ఖ్యాతి దిగజార్చబడిందన్నారు. సమస్యలతో నిత్యం విద్యార్థులు రోడ్డెక్కడం, నిత్యవసరాలు అందకపోవడం ప్రస్తుత ప్రభుత్వ నిర్వాహణపై తీవ్ర చిహ్నంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. రాష్ట్రంలోని 1024 గురుకులాలకు కేవలం 60 కోట్లు మాత్రమే కేటాయించడాన్ని సిగ్గుచేటుగా చూస్తున్నామన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డికి ఆరున్నర లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఉన్న గురుకులాలకు కనీసం 100 కోట్లు కేటాయించే మనసు రాలేదా? అని ప్రశ్నించారు.
Also Read
- Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
- Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
Cough Syrup Tragedy: దగ్గు సిరప్ కేసులో సంచలన నిజాలు.. కమీషన్కి కక్కుర్తి పడ్డ వైద్యుడు..!
మొదటి దృష్ట్యా, అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాల అద్దె బకాయిలు, పెండింగ్లో ఉన్న తాత్కాలిక సిబ్బంది వేతనాలు, మెస్ చార్జీలు, స్టిచ్చింగ్, కాస్మొటిక్ ఛార్జీలు ఇంకా చెల్లించని విషయాలను ఆయన డిమాండ్ చేశారు. గణితం ఉపాధ్యాయులు నియమించడంలో ఆలస్యం, విద్యార్థుల నిరసనలు, పురుగులన్నం సమస్యలు ఇలా కొనసాగుతున్నందుకు ప్రభుత్వం పట్టింపు వహించాలన్నారు. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, ఏదో చేస్తున్నట్లు ప్రచారం చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావు అని ఆయన వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాలను విష వలయాలుగా మార్చారు, అపఖ్యాతిని మూటగట్టారని ఆయన ఆరోపించారు. గ్రీన్ చానెల్ ద్వారా బిల్లులు, వసతి గృహాలకు నిధులు చెల్లిస్తామని చెప్పిన మాటలు ఎప్పుడైతే కార్యరూపం దాల్చుతాయి? అని హరీష్ రావు ప్రశ్నించారు. గురుకులాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికై అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
Employees: ఉద్యోగులకు దీపావళి బహుమతి.. బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..
తాజావార్తలు
-
Chennai LoveStory : ‘చెన్నై లవ్స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
-
Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
-
AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
-
Rohit Sharma: ఎప్పుడు తప్పుకోవాలో రోహిత్కు తెలుసు.. మీరు మూసుకుంటే బెటర్: పాక్ మాజీ స్టార్
-
Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!