Harish Rao : ఇలాగైతే… సీఎం మాటలు నీటి మూటలేనా?
- రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు
- గ్రీన్ చానెల్ నిధులు విడుదల చేస్తామన్న సీఎం మాటలు నీటి మూటలేనా?
- కమీషన్లు రావనే గురుకులకు నిధులు కేటాయించడం లేదా?
- హామీలతో మభ్యపెట్టడం, ఆ తర్వాత మాట మార్చడం ఇదే రేవంత్ సిద్ధాంతం : హరీష్ రావు
Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలోని గురుకులాలపై కొనసాగుతున్న సమస్యలను తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా, ముఖ్యమంత్రి గ్రీన్ చానెల్ ద్వారా నిధులు విడుదల చేస్తామని చెప్పిన మాటలు నీటి మూటలాగా మారాయని, కేటాయించిన నిధులు సిబ్బంది వేతనాలు, వసతి గృహాల మరమ్మతులు, అత్యవసర పనుల కోసం సరైన విధంగా ఉపయోగించబడలేదని అన్నారు.
హరీష్ రావు మాట్లాడుతూ.. కమీషన్లు రావనే గురుకులకు నిధులు కేటాయించడం లేదా? మీ 22 నెలల పాలనలో గురుకులాల ఖ్యాతి దిగజార్చబడిందన్నారు. సమస్యలతో నిత్యం విద్యార్థులు రోడ్డెక్కడం, నిత్యవసరాలు అందకపోవడం ప్రస్తుత ప్రభుత్వ నిర్వాహణపై తీవ్ర చిహ్నంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. రాష్ట్రంలోని 1024 గురుకులాలకు కేవలం 60 కోట్లు మాత్రమే కేటాయించడాన్ని సిగ్గుచేటుగా చూస్తున్నామన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డికి ఆరున్నర లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఉన్న గురుకులాలకు కనీసం 100 కోట్లు కేటాయించే మనసు రాలేదా? అని ప్రశ్నించారు.
Also Read
Cough Syrup Tragedy: దగ్గు సిరప్ కేసులో సంచలన నిజాలు.. కమీషన్కి కక్కుర్తి పడ్డ వైద్యుడు..!
మొదటి దృష్ట్యా, అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాల అద్దె బకాయిలు, పెండింగ్లో ఉన్న తాత్కాలిక సిబ్బంది వేతనాలు, మెస్ చార్జీలు, స్టిచ్చింగ్, కాస్మొటిక్ ఛార్జీలు ఇంకా చెల్లించని విషయాలను ఆయన డిమాండ్ చేశారు. గణితం ఉపాధ్యాయులు నియమించడంలో ఆలస్యం, విద్యార్థుల నిరసనలు, పురుగులన్నం సమస్యలు ఇలా కొనసాగుతున్నందుకు ప్రభుత్వం పట్టింపు వహించాలన్నారు. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం, ఏదో చేస్తున్నట్లు ప్రచారం చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావు అని ఆయన వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాలను విష వలయాలుగా మార్చారు, అపఖ్యాతిని మూటగట్టారని ఆయన ఆరోపించారు. గ్రీన్ చానెల్ ద్వారా బిల్లులు, వసతి గృహాలకు నిధులు చెల్లిస్తామని చెప్పిన మాటలు ఎప్పుడైతే కార్యరూపం దాల్చుతాయి? అని హరీష్ రావు ప్రశ్నించారు. గురుకులాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికై అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
Employees: ఉద్యోగులకు దీపావళి బహుమతి.. బోనస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!