ఢిల్లీ నుండి మోడీ వచ్చి ఒక్క మాట చెప్పారా.. రాష్ట్రం కోసం ఏమైనా మాట్లాడారా.? మనల్ని చూసి ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ఓర్వడం లేదంటూ విమర్శలు గుప్పించారు మంత్రి హరీష్రావు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రయోజనం పొందాలని చూస్తున్నారని, అమిత్ షా, మోడీ వచ్చారు… పేదల కోసం, అభివృద్ధి కొసం ఒక్క మాట చెప్పలేదని ఆయన మండిపడ్డారు. రెచ్చ గొట్టే ప్రయత్నం చేశారని, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వడ్లు కొన అన్నదని, కక్ష కట్టి రైతులను మోసం చేయాలని చూసిందని ఆయన ఆరోపించారు.
రాహుల్ గాంధీ మీ డిక్లరేషన్ ముందు ఛత్తీస్ గడ్ లో అమలు చేయు.. ఎందుకు అక్కడ వడ్లు కొనడం లేదని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా కాంగ్రెస్ అంటేనే కాలి పోయిన మోటర్లు, పేలి పోయిన ట్రాన్స్ ఫార్మర్లు గుర్తు వస్తాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు దునియా మాట్లాడుతారని, 70 ఏళ్ళల్ల మీరు ఎందుకు చేయలేక పోయారని ఆయన ప్రశ్నించారు.