Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Minister Ponguleti Srinivas Reddy Comments At Hanumakonda Collectorate

Ponguleti Srinivasa Reddy: కేసీఆర్‌ కూడా రైతు భరోసా ఇస్తాం

Published Date :January 6, 2025 , 4:54 pm
By Suresh Maddala
  • కేసీఆర్‌ కూడా రైతు భరోసా ఇస్తాం
  • పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి
Ponguleti Srinivasa Reddy: కేసీఆర్‌ కూడా రైతు భరోసా ఇస్తాం
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

వరంగల్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్‌లో అధికారులతో మంత్రులు పొంగులేటి, పొన్నం, కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. పర్యావరణానికి హాని కలగకుండా ఆర్టీసీ అప్‌డేట్ చేస్తున్నామన్నారు. అందుకే ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌కు ఏ టెక్నాలజీ వచ్చినా.. వెంటనే వరంగల్‌కు కూడా టెక్నాలజీ తీసుకొస్తామని చెప్పారు. వరంగల్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని.. భద్రకాళి ట్యాంక్‌బండ్, టెక్స్‌టైల్ పార్కును అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు.

ఇందిరమ్మ ఇండ్లు..
ఉమ్మడి ఏపీలో 25 లక్షల మందికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినట్లు తెలిపారు. రాబోయే నాలుగేళ్ల 20 లక్షల ఇండ్లు కట్టిస్తామని వెల్లడించారు. 4.5 లక్షల ఇండ్లను మొదటి విడతలో ఇస్తామని ప్రకటించారు. అన్ని మండలాల్లో మోడల్ ఇందిరమ్మ ఇండ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సంక్రాంతికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రజల దగ్గరకే ప్రభుత్వా్న్ని పంపిస్తామని చెప్పారు. దాదాపు 80 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని… వాటిని స్క్రూటినీ చేసి పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఇండ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. దరఖాస్తు చేసుకోని వాళ్లు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇందిరమ్మ ఇండ్లు అనేది నిరంతర ప్రక్రియ అని.. లబ్ధిదారులకు తప్పకుండా ఇస్తామని చెప్పుకొచ్చారు. అంతేకుండా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను కూడా పూర్తి చేసి అందిస్తామని ప్రకటించారు.

Also Read

  • KTR : నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి.
  • Kunamneni Sambasiva Rao: కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాదు.. కూనంనేని కీలక వ్యాఖ్యలు
  • Boianapalli Vinod Kumar: రజతోత్సవ సభ.. కొత్త తరానికి కొత్త ఆలోచనలు..!
  • Devadula Pipeline Leak: దేవాదుల ప్రాజెక్ట్ పైప్‌లైన్ లీక్.. మండిపడిన రైతులు
Add as a preferred
source on google

రైతు భరోసా…
వేలాది మంది రైతుల అభిప్రాయాలను సేకరించాక రైతు భరోసాపై నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతులకు ఎకరానికి రూ.12 వేలు రైతు భరోసా ఇస్తామని వెల్లడించారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని.. జనవరి 26 నుంచి రైతు భరోసా, రేషన్ కార్డులు అందించనున్నట్లు ప్రకటించారు. భూమిలేని అర్హులైన పేదలకు ఏటా రూ. 12 వేలు సాయం అందిస్తామని తెలిపారు. కేసీఆర్ 200 ఎకరాలు సాగు చేస్తే…ఆయనకు కూడా రైతు భరోసా అందిస్తామని చెప్పారు. 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసినట్లు చెప్పారు. సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ ఇచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో మర్చిపోయిన రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుందని వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఏం కోరుకున్నారో అవన్నీ నెరవేరుతాయన్నారు. పేదోడి సొమ్ము విదేశాలకు పంపించిన అక్రమార్కుడిని చట్ట ప్రకారం కేసులు పెడితే ప్రతిపక్షాలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నాయని.. ప్రతిపక్షాల చిల్లర మాటలకు తమ పనులే సమాధానం చెబుతాయని పొంగులేటి పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • CM Revanth Reddy
  • congress
  • Hanumakonda Collectorate
  • kcr

తాజావార్తలు

  • Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్

  • India-Pakistan: “పాకిస్తాన్‌తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..

  • Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!

  • SRH Vs PBKS: ఉప్పల్‌లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్‌తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం…

  • Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్‌తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions