Ponguleti Srinivasa Reddy: కేసీఆర్ కూడా రైతు భరోసా ఇస్తాం
- కేసీఆర్ కూడా రైతు భరోసా ఇస్తాం
- పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్లో అధికారులతో మంత్రులు పొంగులేటి, పొన్నం, కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడారు. పర్యావరణానికి హాని కలగకుండా ఆర్టీసీ అప్డేట్ చేస్తున్నామన్నారు. అందుకే ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. హైదరాబాద్కు ఏ టెక్నాలజీ వచ్చినా.. వెంటనే వరంగల్కు కూడా టెక్నాలజీ తీసుకొస్తామని చెప్పారు. వరంగల్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని.. భద్రకాళి ట్యాంక్బండ్, టెక్స్టైల్ పార్కును అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు.
ఇందిరమ్మ ఇండ్లు..
ఉమ్మడి ఏపీలో 25 లక్షల మందికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినట్లు తెలిపారు. రాబోయే నాలుగేళ్ల 20 లక్షల ఇండ్లు కట్టిస్తామని వెల్లడించారు. 4.5 లక్షల ఇండ్లను మొదటి విడతలో ఇస్తామని ప్రకటించారు. అన్ని మండలాల్లో మోడల్ ఇందిరమ్మ ఇండ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సంక్రాంతికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రజల దగ్గరకే ప్రభుత్వా్న్ని పంపిస్తామని చెప్పారు. దాదాపు 80 లక్షల మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని… వాటిని స్క్రూటినీ చేసి పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఇండ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. దరఖాస్తు చేసుకోని వాళ్లు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇందిరమ్మ ఇండ్లు అనేది నిరంతర ప్రక్రియ అని.. లబ్ధిదారులకు తప్పకుండా ఇస్తామని చెప్పుకొచ్చారు. అంతేకుండా అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను కూడా పూర్తి చేసి అందిస్తామని ప్రకటించారు.
Also Read
- KTR : నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి.
- Kunamneni Sambasiva Rao: కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాదు.. కూనంనేని కీలక వ్యాఖ్యలు
- Boianapalli Vinod Kumar: రజతోత్సవ సభ.. కొత్త తరానికి కొత్త ఆలోచనలు..!
- Devadula Pipeline Leak: దేవాదుల ప్రాజెక్ట్ పైప్లైన్ లీక్.. మండిపడిన రైతులు
రైతు భరోసా…
వేలాది మంది రైతుల అభిప్రాయాలను సేకరించాక రైతు భరోసాపై నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతులకు ఎకరానికి రూ.12 వేలు రైతు భరోసా ఇస్తామని వెల్లడించారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తామని.. జనవరి 26 నుంచి రైతు భరోసా, రేషన్ కార్డులు అందించనున్నట్లు ప్రకటించారు. భూమిలేని అర్హులైన పేదలకు ఏటా రూ. 12 వేలు సాయం అందిస్తామని తెలిపారు. కేసీఆర్ 200 ఎకరాలు సాగు చేస్తే…ఆయనకు కూడా రైతు భరోసా అందిస్తామని చెప్పారు. 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసినట్లు చెప్పారు. సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ ఇచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో మర్చిపోయిన రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుందని వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఏం కోరుకున్నారో అవన్నీ నెరవేరుతాయన్నారు. పేదోడి సొమ్ము విదేశాలకు పంపించిన అక్రమార్కుడిని చట్ట ప్రకారం కేసులు పెడితే ప్రతిపక్షాలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నాయని.. ప్రతిపక్షాల చిల్లర మాటలకు తమ పనులే సమాధానం చెబుతాయని పొంగులేటి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!