Bandi Sanjay: బండి సంజయ్ను కలిసిన గ్రూప్ -1 అభ్యర్థులు..
- గ్రూప్-1 మెయిన్స్కు ప్రిలిమ్స్ నుండి 1:100 చొప్పున ఎంపిక జరిగేలా చూడాలి..
- గ్రూప్-1 అభ్యర్థులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమావేశం..
- నాలుగేళ్లలో మూడుసార్లు గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయడం వల్ల తీవ్రంగా నష్టపోయాం..
- నిరుద్యోగుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని బండి సంజయ్ హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: గ్రూప్-1 అభ్యర్థులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం సమావేశమయ్యారు. గ్రూప్-1 మెయిన్స్కు ప్రిలిమ్స్ నుండి 1:100 చొప్పున ఎంపిక జరిగేలా నిరుద్యోగులు కోరుతున్నారు. నాలుగేళ్లలో మూడుసార్లు గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయడం వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని నిరుద్యోగులు వాపోయారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 1:100 చొప్పున మెయిన్స్కు ఎంపిక చేస్తామని కాంగ్రెస్ నేతలు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారని నిరుద్యోగులు గుర్తు చేశారు. మెయిన్స్ కు 1:50 చొప్పున ఎంపిక చేయడం వల్ల గ్రూప్ 1 పోస్టులు ఎక్కువగా ఉండడం వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లలో మూడుసార్లు గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయడంపై తీవ్ర నష్టం జరిగిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు.
Read also: Minister Kondapalli Srinivas: బాధ్యతలు స్వీకరించిన మంత్రి శ్రీనివాస్.. చిన్న పరిశ్రమలకు రాయితీలు
Also Read
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
నిరుద్యోగులు గ్రూప్ 1 పోస్టులు ఎక్కువగా ఉండడంతో 1:50 చొప్పున మెయిన్స్ కు ఎంపికైతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. కేరళ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్కు ఎంపికైన 1:75 అభ్యర్థులను గుర్తు చేశారు. గతంలో వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మెయిన్స్కు 1:100 ఎంపిక చేసిందన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే నిరుద్యోగులు పెద్దఎత్తున ధర్నా చేపడతామన్నారు. నిరుద్యోగుల డిమాండ్ న్యాయమైనదేనని ఎన్నికల్లో బండి సంజయ్ ఇచ్చిన హామీ మేరకు మెయిన్స్కు 1:100 ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరుద్యోగుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కాగా.. తెలంగాణలో గత ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించి.. సంబంధిత ప్రాథమిక కీ, మాస్టర్ ప్రశ్నపత్రాన్ని కూడా విడుదల చేశారు.
Bike Thieves: పార్క్ చేసిన వాహనాలే టార్గెట్.. సీసీ కెమెరాలో దృశ్యాలు
తాజావార్తలు
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
-
Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?