Bandi Sanjay: బండి సంజయ్ను కలిసిన గ్రూప్ -1 అభ్యర్థులు..
- గ్రూప్-1 మెయిన్స్కు ప్రిలిమ్స్ నుండి 1:100 చొప్పున ఎంపిక జరిగేలా చూడాలి..
- గ్రూప్-1 అభ్యర్థులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమావేశం..
- నాలుగేళ్లలో మూడుసార్లు గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయడం వల్ల తీవ్రంగా నష్టపోయాం..
- నిరుద్యోగుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని బండి సంజయ్ హామీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: గ్రూప్-1 అభ్యర్థులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం సమావేశమయ్యారు. గ్రూప్-1 మెయిన్స్కు ప్రిలిమ్స్ నుండి 1:100 చొప్పున ఎంపిక జరిగేలా నిరుద్యోగులు కోరుతున్నారు. నాలుగేళ్లలో మూడుసార్లు గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయడం వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని నిరుద్యోగులు వాపోయారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 1:100 చొప్పున మెయిన్స్కు ఎంపిక చేస్తామని కాంగ్రెస్ నేతలు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారని నిరుద్యోగులు గుర్తు చేశారు. మెయిన్స్ కు 1:50 చొప్పున ఎంపిక చేయడం వల్ల గ్రూప్ 1 పోస్టులు ఎక్కువగా ఉండడం వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లలో మూడుసార్లు గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయడంపై తీవ్ర నష్టం జరిగిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు.
Read also: Minister Kondapalli Srinivas: బాధ్యతలు స్వీకరించిన మంత్రి శ్రీనివాస్.. చిన్న పరిశ్రమలకు రాయితీలు
Also Read
నిరుద్యోగులు గ్రూప్ 1 పోస్టులు ఎక్కువగా ఉండడంతో 1:50 చొప్పున మెయిన్స్ కు ఎంపికైతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. కేరళ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్కు ఎంపికైన 1:75 అభ్యర్థులను గుర్తు చేశారు. గతంలో వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మెయిన్స్కు 1:100 ఎంపిక చేసిందన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే నిరుద్యోగులు పెద్దఎత్తున ధర్నా చేపడతామన్నారు. నిరుద్యోగుల డిమాండ్ న్యాయమైనదేనని ఎన్నికల్లో బండి సంజయ్ ఇచ్చిన హామీ మేరకు మెయిన్స్కు 1:100 ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరుద్యోగుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కాగా.. తెలంగాణలో గత ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించి.. సంబంధిత ప్రాథమిక కీ, మాస్టర్ ప్రశ్నపత్రాన్ని కూడా విడుదల చేశారు.
Bike Thieves: పార్క్ చేసిన వాహనాలే టార్గెట్.. సీసీ కెమెరాలో దృశ్యాలు
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!