Godavari River Floods: గోదావరి మహోగ్రరూపం.. ద్వీపంగా మారిన భద్రాచలం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానలకు నదులు, ప్రాజెక్టు, నిండి జన జీవనం అతలాకుతలంగా మారింది. పలు జిల్లాలకు, గ్రామాలకు, రాష్ట్రాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అయితే.. భద్రాచలంలో ప్రమాదకరస్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. భద్రాచలం లో 70 అడుగుల చేరువలో గోదావరి 68 అడుగుల వరద నీరు తాకింది. కాగా.. 67 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. గోదావరిలోకి 21 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో.. ముందస్తుగా ఊహించినట్లే 73 అడుగులు దాటే అవకాశం వుందని అధికారులు వెల్లడించారు. 36 ఏళ్ల తర్వాత భద్రాచలంలో మళ్లీ 70 అడుగులు గోదావరి నీటిమట్టం దాటుతుంది. 1986 తర్వాత ఆస్థాయిలో గోదావరికి మొదటిసారి వరద ఇంతగా పోటెత్తింది. భద్రాచలం టౌన్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసారు. ప్రస్తుతం మరో 48 గంటలు చాలా కీలకమైన సమయమని ఉన్నతాధికారులు ప్రకటించారు.
read also: Virat Kohli: కోహ్లీకి పాక్ స్టార్ బ్యాట్స్మన్ మద్దతు
Also Read
- KTR: "మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి".. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..
- Hyderabad: పసిబిడ్డతో వెళ్తున్న మహిళపై కామాంధుడి వికృత చేష్టలు.. ఇంకొకడు ఇలాంటి పని చేయాలంటే వణుకు పుట్టేలా..
- OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
భద్రాచలం గోదావరి బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఇప్పటికే 2 వేల కుటుంబాలను పునరావసర కేంద్రాలకు అధికారులు తరలించారు. కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ లారీ యార్డ్ వద్ద నేషనల్ హైవే నెంబర్ 30 రోడ్డుపై పారుతున్న గోదావరి వరదతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంకు వెళ్లేందుకు ఉన్న ఒక్క రహదారి వరద పట్టడంతో భద్రాచలంతో బాహ్య సంబంధాలు తెగిపోయాయి. ఇప్పటికే పలు కాలనీలు నీటమునిగాయి. కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ, సుభాష్ నగర్ , అశోక్ నగర్, శాంతి నగర్, రామాలయం ప్రాంతంలోని ఇళ్లల్లోకి భారీ వరద చేరింది. దీంతో నివాసాలు ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే అన్ని రోడ్లపై వరదనీరు చేరింది. కొన్ని గ్రామాలకు 4 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈనేపథ్యంలో.. రాత్రి భద్రాచలంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బస చేసారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
KTR: “మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి”.. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..
-
Pakistan: హైజాక్ చేసిన అదే రైలు.. “జాఫర్ ఎక్స్ప్రెస్”నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
-
Gujjalapudi Hari: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గుజ్జలపూడి హరి కన్నుమూత
-
Rishabh Pant’s LSG Captaincy: రూ.27 కోట్లు పెట్టి కొంటే.. అట్టర్ ఫ్లాప్ ప్రదర్శన.. పంత్ కెప్టెన్సీకి ముప్పు!
-
BYD Atto 3: BYD అట్టో 3 విడుదల.. 630KM రేంజ్, LiDAR టెక్నాలజీ, కేవలం 9 నిమిషాల్లో పూర్తి ఛార్జ్
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?