Hyderabad:‘పుష్ప’ తరహాలో స్మగ్లింగ్.. అరటిపండ్ల చాటున ఎర్ర చందనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యాపారంలో వచ్చిన నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఆలోచిస్తున్న ఇద్దరికి తెలుగులో వచ్చిన పుష్ప సినిమా కొత్త ఆలోచనకు ఉత్తేజపరిచింది. దీంతో శేషాచలం అడవుల్లో దొరికే ఎర్ర చందనంను స్మగ్లింగ్ చేసి డబ్బు సంపాదించాలని రాయలసీమకు చెందిన అరటిపండ్ల వ్యాపారులిద్దరూ స్కెచ్ వేశారు. అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి, అరటిపండ్ల చాటున హైదరాబాద్కు తరలించి అడ్డంగా ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులకు పట్టుబడ్డారు.
వీరివద్ద నుంచి రూ. 60.18 లక్షల విలువైన 1500 కిలోల ఎర్ర చందనం స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కథనం ప్రకారం.. ఏపీ కడప జిల్లాకు చెందిన షేక్ మహ్మద్ రఫీ అరిటి పండ్ల వ్యాపారి. ఏపీ, యూపీ, రాజస్థాన్, ఢిల్లీ, తెలంగాణ తదితర రాష్ర్టాలకు అరటిపండ్లు సరఫరా చేస్తుంటాడు. కర్నూల్ జిల్లాకు చెందిన ముల్లా బషీర్ అహ్మద్ ప్రస్తుతం హైదరాబాద్లోని నేరెడ్మెట్ ప్రాంతంలో నివాసముంటూ అరటిపండ్ల వ్యాపారం చేస్తున్నాడు.
Also Read
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
- Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
- KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ఒకటే వ్యాపారం కావడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తాము చేస్తున్న వ్యాపారంలో వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఎర్ర చందనం వ్యాపారం చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే వీరికి కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి చెందిన మూర్తి పరిచయమయ్యాడు. అతడి వద్ద నుంచి లక్ష రూపాయలకు 1500 కిలోల బరువున్న 31 ఎర్ర చందనం దుంగలు కొనుగోలు చేశారు.
వాటిని అరటి పండ్లు సరఫరా చేసే లారీల్లో హైదరాబాద్కు తరలించి, మౌలాలిలో దాచిపెట్టారు. విశ్వసనీయ సమాచారంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి బృందం మల్కాజిగిరి పోలీసుల సహకారంతో ఎర్ర చందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మూడు సెల్ఫోన్లు, రూ. 1600 నగదు రికవరీ చేశారు. ఎర్రచందనం విలువ సుమారు రూ. 68,16,600 ఉంటుందని పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న మూర్తి కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..