Sandra Venkata Veeraiah: కాంగ్రెస్ పాలనపై హట్ కామెంట్స్ చేసిన మాజీ ఎమ్మెల్యే సండ్ర..
- కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాట్ కామెంట్స్..
- రైతు బంధు ఎత్తేసి ఆ డబ్బులతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది..
- అసెంబ్లీలో మహిళ ఎమ్మెల్యేను అవమానించారు: సండ్ర వెంకట వీరయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sandra Venkata Veeraiah: ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిషత్తు కార్యాలయంలో పదవీకాలం ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపిపిలకు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై హట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కళ్యాణలక్ష్మీ, షాదీ ముభారక్ పథకాల కింద ఇంటింటికి తిరిగి చెక్కుతో పాటు చీర పంపిణి చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత పెళ్ళిళ్ళు కాలేదా.. తులం బంగారం అన్నారు ఏమైంది అని ప్రశ్నించారు. భూమిలేని నిరు పేదల చూట్టే ఈ ప్రభుత్వం తిరుగుతుందని అన్నారు.. భూమి లేని నిరు పేదలకు 15 వేల రూపాయలు ఇస్తామన్నారు.. కౌలు రైతు ఇస్తామన్నారు ఏమైంది.. చివరకు రైతు బంధు ఎత్తెసి ఆ డబ్బులతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రుణామాఫి చేసింది అని సండ్ర వెంకట వీరయ్యా పేర్కొన్నారు.
Read Also: Wayanad Landslides : మృతుల సంఖ్య 340.. 217 మృతదేహాలు, 143 శరీర భాగాలకు పోస్టుమార్టం పూర్తి
Also Read
- CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
- KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటుతుంది అని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యా చెప్పుకొచ్చారు. రుణామాఫీ చుట్టూ రాష్ట్రాన్ని తిప్పుతున్నారే తప్ప ఇచ్చిన హమీలు గురించి ఏ ఒక్కరు మాట్లాడం లేదన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కానీ ఎన్ని ఖాళీలో ప్రకటించలేదు.. క్క రాష్ట్రం ఏపీలో పెన్షన్లు పెంచారు.. ఇక్కడ పెంచలేదు పైగా రెగ్యులర్ గా పెన్షన్ రావటం లేదన్నారు. అసెంబ్లీలో మహిళ ఎమ్మెల్యేను అవమానించారు.. సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు.. అన్ని విషయాలు ప్రజలు గమనిస్తున్నారు.. ఎప్పుడూ చీకటి ఉండదు, ఎప్పుడూ వెలుగు ఉండదు.. వెలుగుకి ఒక్కసారి చీకటి వస్తేనే ఆ వెలుగుకి ఉన్న విలువ తెలుస్తుంది.. మనకి చీకటి వచ్చింది కాబట్టే వెలుగులో ఎంత మంచి జరుగుతుందో ఏం జరుగుతుందో ప్రజలకు అర్దం అవుతుంది అని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్రా తెలిపారు.
Read Also: Delhi: ఢిల్లీలో దారుణం.. సివిల్స్ విద్యార్థిని ఆత్మహత్య.. కన్నీళ్లు తెప్పిస్తున్న సూసైడ్ లెటర్
కాగా, మనకి చీకటి రావటం వలన మంచే జరింగదని అందరు భావించాలని సండ్ర వెంకట వీరయ్యా వెల్లడించారు. ఈ చీకటిలోనే మన విలువ ప్రజలకు తెలుస్తుంది.. పార్లమెంటు ఎన్నికల్లో మన ఓట్లు చెక్కు చెదరాయి.. పోలింగ్ తేడాతో కొన్ని బీజేపీ, కొన్ని ఇండిపెండెంట్ కు పడ్డాయి.. తప్ప సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఏం పెరగలేదన్నారు. మన మీద వ్యతిరేకత కూడా పోలింగ్ లో తెలిసింది తప్ప మనం ఓడిపోతాం అని అనుకోలేదు.. ప్రజలు అన్ని ఆలోచించి ఓట్లు వేశారు.. ప్రజలను తప్పు పట్టాల్సిన అవసరం లేదు.. మన పరిపాలన లో ఏం లోపాలు జరిగాయి.. ఏం తప్పులు జరిగాయని సమీక్షించుకొని భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజల విశ్వాసం చొరగానే విధంగా నడుచుకుందాం అని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
-
Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
-
Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
-
Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?