Wayanad Landslides : మృతుల సంఖ్య 340.. 217 మృతదేహాలు, 143 శరీర భాగాలకు పోస్టుమార్టం పూర్తి
Wayanad Landslides : కేరళలోని వాయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 344కు చేరుకోగా, మరో 206 మంది గల్లంతయ్యారు. శనివారం ఐదో రోజు కూడా రెస్క్యూ టీం ఆపరేషన్ కొనసాగుతోంది. రక్షణ దళాలు, NDRF, SDRF, పోలీసు, అగ్నిమాపక సేవ, వాలంటీర్లకు చెందిన 1,500 మంది సిబ్బందితో కూడిన రెస్క్యూ టీమ్ శనివారం ఉదయం చురలమల, వెల్లరిమల, ముండకైల్, పంచిరిమడోమ్లోని నాలుగు ప్రాంతాలలో సోదాలు ప్రారంభించింది.
Read Also:Lakshya Sen: అసలెవరు ఈ లక్ష్య సేన్.. బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా..
Also Read
- Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్పై తీవ్ర చర్యలు.. ఊహించని విధంగా..
- Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
ఇప్పటి వరకు 152 మృతదేహాలను గుర్తించగా, 74 మందిని గుర్తించాల్సి ఉంది. మృతుల్లో 30 మంది చిన్నారులు కూడా ఉన్నారు. శిథిలాల నుంచి పెద్ద సంఖ్యలో ఛిద్రమైన శరీర భాగాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ సుమారు 100 సహాయక శిబిరాలు ఉన్నాయి. వీటిలో సుమారు 9,500 మందిని తరలించారు. జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో 84 మంది చికిత్స పొందుతున్నారు. 217 మృతదేహాలు, 143 శరీర భాగాలకు పోస్టుమార్టం నిర్వహించామని, 119 మృతదేహాలను బంధువులకు అప్పగించామని చెప్పారు. ఓ ప్రకటన ప్రకారం, 518 మంది ఆసుపత్రులలో చేరారు. వారిలో 89 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, జూలై 30న ప్రారంభమైన సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఇంకా 206 మంది గల్లంతయ్యారని తెలిపారు.
Read Also:Damodar Raja Narasimha: మాదిగలు ఎవరికి వ్యతిరేకం కాదు.. అందరం సమానమే..!
కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో శనివారం వరుసగా ఐదో రోజు కూడా సోదాలు కొనసాగుతున్నాయి. శిథిలాలలో ఇంకా చిక్కుకున్న వ్యక్తుల కోసం వెతకడానికి 1,300 మందికి పైగా రెస్క్యూ వర్కర్లు, భారీ యంత్రాలు, అత్యాధునిక పరికరాలను మోహరించారు.122 టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్, కన్నూర్ యూనిట్కు అనుబంధంగా ఉన్న నటుడు మోహన్లాల్ శనివారం ఉదయం తన యూనిట్తో బాధిత ప్రాంతాలకు చేరుకున్నారు. మోహన్లాల్, సైనిక దుస్తులు ధరించి, ముందుగా మప్పాడిలోని బేస్ క్యాంపుకు చేరుకుని రక్షణ దళాలను కలిశారు. అనంతరం చురల్మల చేరుకుని రెస్క్యూ టీమ్తో మాట్లాడారు.
తాజావార్తలు
-
Riyan Parag: బిగ్ షాక్.. రియాన్ పరాగ్పై తీవ్ర చర్యలు.. ఊహించని విధంగా..
-
Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
-
Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
-
MI vs SRH: వాంఖడే చరిత్రలోనే ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు.. కన్నీరు పెట్టిన నీతా అంబానీ!
-
Motorola Moto G87: 200MP కెమెరా, 5200mAh బ్యాటరీతో మోటో G87 విడుదల
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!