Patnam Mahender Reddy: బీజేపీలోకి పట్నం మహేందర్ రెడ్డి.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
former-minister-patnam-mahender-reddy-scotches-off-rumours-of-his-joining-bjp: మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి , నాగర్ కర్నూల్ జిల్లాకు ఇన్చార్జి వ్యవహార శైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్కు గుడ్ బై చెప్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈనేపథ్యంలో.. ఆయన ఎట్టకేలకు స్పందించారు. అయితే తాను భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తరపున మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు పీ.మహేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
ఏప్రిల్ 23న చేవెళ్లలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్న కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో డాక్టర్ మహేందర్రెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరతారని గత రెండు రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓ మాజీ మంత్రి, మరికొంత మంది నేతలు కూడా హోంమంత్రి సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉందని బీజేపీ వర్గాలంటున్నాయి. డాక్టర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అదంతా తప్పుడు సమాచారం జరుగుతుందని అన్నారు. నేను బీజేపీలో ఎందుకు వెళ్తాను? అసలు ఆలోచనే నాకు లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కొన్ని లోకల్ గ్రూప్ లల్లో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్ద తెలిపారు. కొందరు దద్దమ్మలు తప్పుడు ప్రచారం చేస్తున్నరని మండిపడ్డారు. ఆ ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
Read also: Beer sales: తెగ తాగేస్తున్నారు.. బీర్ల అమ్మకాల్లో తెలంగాణ టాప్
తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న నివాసంలో జరిగిన ముఖ్య నేతల భేటీ వెనుక ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి హస్తం ఉందనే వాదనలు రాజకీయ విశ్లేషకుల వాదనలు వినిపించాయి. 30ఏండ్ల నుంచి మహేందర్ రెడ్డి వెంటే ఉన్న ముఖ్యనేత కరణం పురుషోత్తంరావు చెబుతున్నా అధికారపార్టీలోని అధికారులు ఎవరూ వినడం లేదని పలువురు నేతలు దృష్టికి తెచ్చారు. తమ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమని వివరించినట్లు సమాచారం బయటలకు వచ్చింది. దీంతో ఇప్పటికే తాండూరు నియోజకవర్గంలో హవా సాగిన బీఆర్ ఎస్ రెండు గ్రూపులుగా చీలిపోయింది. అప్పటి నుంచి ఆధిపత్య పోరు మొదలైంది. బీఆర్ఎస్ను వీడాలనే ఆలోచనతోనే నేతలు ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు జనం. ఇప్పటికే కొందరు ముఖ్య నేతలతో ఎమ్మెల్సీలు చర్చలు జరిపినట్లు సమాచారం. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేయడం ఖాయమని ఆయన అనుచరులు కూడా చెబుతున్నారు. ఆయన పార్టీ మారడం తథ్యమని జనాలు ఫిక్స్ అవుతున్ననేపథ్యంలో పట్నం మహేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కొందరు దద్దమ్మలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాటిని నమ్మెద్దని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదని తెలిపారు.
Read also: Heart attack: ఆగిన మరో చిన్ని గుండె.. అమెరికాలో ఖమ్మం వైద్య విద్యార్థి మృతి
డాక్టర్ మహేదర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి పి.ఇంద్రారెడ్డికి మేనల్లుడు. తాండూరు నుంచి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన తొలిసారిగా 1994లో తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పురాణ ఎన్టీ రామారావు ఆధ్వర్యంలో టీడీపీ తరపున రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. అనంతరం 2014లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి ఎన్నికలకు ముందు తాండూరు నుంచి టీఆర్ఎస్ టికెట్పై గెలుపొందారు. 2014-2018 మధ్య రాష్ట్ర రవాణా మంత్రిగా పనిచేశాడు. ఇక 2018 ఎన్నికల్లో పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయిన తరువాత, 2019 లో తెలంగాణాలో టిఆర్ఎస్ టిక్కెట్ పై శాసనమండలికి ఎన్నికయ్యారు. రోహిత్రెడ్డి టీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి తాండూరు నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మహేందర్రెడ్డి భార్య సునీతారెడ్డి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా రెండోసారి కొనసాగుతున్నారు. అతని సోదరుడు నరేందర్ రెడ్డి రంగా రెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీగా ఉన్నారు. తరువాత ఆయన 2018 లో కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిని ఓడించి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
మహేందర్ రెడ్డి కుటుంబం కూడా బీఆర్ఎస్కు విధేయత చూపడంతో ఆయన కెరీర్ బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్)కు మళ్లిందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్రెడ్డితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అప్పట్లో టీఆర్ఎస్లో ఉన్న చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డితో మహేందర్రెడ్డికి వాగ్వాదం ఉండేది. ఇద్దరు నేతల మధ్య పార్టీలో అంతర్గత కుమ్ములాటలు పార్టీ నాయకత్వానికి ఎప్పుడూ ముల్లులా మారాయి. ఇరువర్గాలను శాంతింపజేసేందుకు తీవ్రంగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాండూరు నుంచి డాక్టర్ మహేందర్ రెడ్డిని పోటీ చేసేందుకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన విధేయుడైన పైలట్ రోహిత్ రెడ్డిని (కాంగ్రెస్ తరపున) పోటీకి దింపారు. కొండా విశ్వేశ్వర్రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత రోహిత్రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి రోహిత్ రెడ్డి, డాక్టర్ మహేందర్ రెడ్డిల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ..డాక్టర్ మహేందర్రెడ్డి సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీగా ఎన్నికచేశారు.
Rubber Man: మనిషా లేక రబ్బరా.. శరీరాన్ని అలా మెలికలు తిప్పేస్తున్నాడేంటి
తాజావార్తలు
-
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
-
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
-
Raviteja: ‘ఇరుముడి’ విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!