Rajanna Sircilla: ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన రైతన్న…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతన్నలు కన్నెర్న చేశారు. రెండు నెలలు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేసేవారు లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల ధర్నా చేపట్టారు. కల్లాల్లో ధాన్యం పోసి 2 నెలలు గడుస్తున్నా ఇంతవరకు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడిస్తామని రైతుల హెచ్చరించారు. రైతుల ధర్నాతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా సమయం గడిచిందని ధాన్యం కొలుగోలుకు ఎవరు ముందుకు రావడం లేదని మండిపడుతున్నారు.
Read also: Swathi : స్వాతి మలివాల్ ఎఫ్ఐఆర్ దాఖలు చేయకపోవడంపై వెల్లువెత్తున్న అనుమానాలు
Also Read
- Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
- KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
- Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే 'కమలం' వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
ఇలా అయితే మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలని, రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలకు పంటలు తడిస్తున్నాయని, తడిసిన పంటలను కూడా కొనే దిక్కులేదని మండిపడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తానని చెబుతున్నా అధికారులు ఎవరూ స్పందించడం లేదని వాపోతున్నారు. కల్లాల్లో ధాన్యం రెండు నెలల నుంచి వుందని, పట్టించుకునే నాధుడే కరువయ్యాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు చెప్పిన ఎవరు స్పందించడం లేదని, ప్రభుత్వం నుంచి సమాచారం లేదంటూ తప్పించుకుంటున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు. అప్పులు చేసి పంటలు పండించామని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పంచాలని కోరుతున్నారు. రైతులపై ప్రభుత్వం ఎలా ఉండబోతుందున్నది ప్రశ్నార్థకంగా మారింది.
Read alsg: Fair Accident: సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫుట్ వేర్ షాప్..
మరోవైపు ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మార్కెట్ యార్డు వద్ద తేమ ఎక్కువగా ఉందని జొన్నలను కొనుచేయకుండా అధికారులు ఆపేశారు. అంతేకాకుండా.. రైతుల వాహానాలను గేటు బయటే ఉంచారు. ఉదయం నుంచి గేటు ముందు వాహానాలతో రైతుల పడిగాపులు కాస్తున్నా అధికారులు స్పందన లేకపోవడం గమనార్హం. అయితే ఒకవైపు రైతుల పంటను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నా.. అధికారులు మాత్రం కొనుగోలు చేయకుండా ఉంచడం రైతుల సహనానికి పరీక్షగా మరింది.
Vaccine Side Effects : కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత శరీరం పనిచేయడం లేదు.. మహిళ కేసు నమోదు
తాజావార్తలు
-
T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!