Hyderabad Crime: విషాదం.. కోడలు వేధింపులతో పురుగుల మందు తాగిన కుటుంబసభ్యులు..
- సికింద్రాబాద్ తాజ్ త్రి స్టార్ హోటల్ లో ఓ కుటుంబం ఆత్మహత్యయత్నం..
- రూమ్ లో అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు..
- యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు..
- కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతున్న మహంకాళి పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: కోడలు వేధింపులు తాళలేక కుటుంబ సభ్యులు మొత్తం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సికింద్రాబాద్ లో కలకలం రేపింది. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాజ్ త్రి స్టార్ హోటల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. హోటల్ లోని మూడవ అంతస్తులో 308 గదిలో ముగ్గురు అపస్మారక స్థితిలో పడి ఉండటంతో హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్ఠలికి చేరుకున్న పోలీసులు.. ముగ్గురిని 108 అనబులెన్స్ లో యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరు ముగ్గురూ కొత్తగూడెం భద్రాద్రి జిల్లా చెందినవారుగా గుర్తించారు. తండ్రి నారాయణ (52) తల్లి పద్మావతి (47 ) కొడుకు సృజన్ (23) గా గుర్తించారు. ఇటీవలే ఫిబ్రవరి 14న తల్లిదండ్రులు.. కొడుకు సృజన్ ను ఘనంగా పెళ్లి చేశారు.
Read also: Festival Rush: హైదరాబాద్లోని బస్సులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ..
Also Read
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
అయితే కొద్ది రోజులు బాగా సాగిన వీరి జీవితంలో మనస్పర్థలు మొదలయ్యాయని సమాచారం. దీంతో కోడలు కావ్య కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలోని చెంచిపల్లి పోలీస్ స్టేషన్ లో భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భర్తపై 498 A కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు అందరు కోడలు కావ్వకి నచ్చ చెప్పే ప్రయత్నం చేసిన ఫలితం దక్కలేదు. ముగ్గురు కలిసి సికింద్రాబాద్ చేరుకుని తాజ్ త్రి స్టార్ హోటల్ లోని 308 రూమ్ లో బస చేశారు. వీరు ముగ్గురు కలిసి కోడలికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నాట్లు తెలిపారు. అవమానం భరించలేమని జ్యూస్ లో మత్తుపదార్డం కలిపి ముగ్గురు సేవించారు. అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని హూటల్ యాజమాన్యం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనేవ వీరిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహంకాళి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరి ముగ్గురి పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. కోడలు కావ్వ, భర్త సృజన్ పై పెట్టిన కేసుపై ఆరా తీస్తున్నారు.
Health Tips: మెంతి ఆకులు, గింజలు గొప్పతనం తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!