Festival Rush: హైదరాబాద్లోని బస్సులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ..
- దసరా పండుగ సందర్భంగా బస్సులు- రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ..
- స్టేషన్లలో కాలు పట్టేంత స్థలం కూడా లేకుండా జనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Festivel Rush: దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ సందడిగా మారింది. తెలంగాణ రాష్ట్రం నుంచి దసరాకు వెళ్లే ప్రయాణికులు ఇంటి బాట పడతుండటంతో బస్సులు, రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగింది. శనివారం వచ్చే విజయదశమికి మరికొన్ని రోజులు మాత్రమే ఉండడంతో హైదరాబాద్లోని అన్ని బస్సులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సందడి నెలకొంది. హైదరాబాద్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల కొన్ని జిల్లాలకు ప్రజల భారీ తరలివెళుతున్నారు. ప్రతి ఒక్కరూ శనివారం లోపు వారి స్వగ్రామాలకు వెళ్లి వారి వారి కుటుంబాలతో గడిపేందుకు బయలు దేరారు. సికింద్రాబాద్లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజిబిఎస్), జూబ్లీ బస్ స్టేషన్ (జెబిఎస్) వంటి ప్రధాన బస్ స్టేషన్లు రిజర్వ్ చేసిన టిక్కెట్లతో చేరుకునే వారి సంఖ్య పెరిగింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి రైల్వేస్టేషన్లు అన్ని ప్రయాణికులతో సందడిగా మారాయి.
Read also: Jagtial News: సార్ కాపాడండి.. ఇరాక్ లో జగిత్యాల యువకుడి ఆవేదన..
Also Read
స్టేషన్లలో కాలు పట్టేంత స్థలం కూడా లేకుండా జనంతో కిటకిట లాడుతున్నాయి. ప్లాట్ఫారమ్లోని ఎక్కడ చూసిన బట్టలు, బహుమతులతో నిండిన భారీ సామానుతో దసరా పండుగకు తీసుకున్న వస్తువుల దృశ్యాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మొత్తం పండుగ సీజన్ కోసం ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రాష్ట్ర రవాణా సంస్థ హైదరాబాద్లో అనేక చోట్లు పికప్ పాయింట్లను ఏర్పాటు చేసింది. అక్టోబరు 1 నుండి 15 వరకు MGBS, JBS, LB నగర్, ఉప్పల్, అరమ్ఘర్, సంతోష్ నగర్, KPHB నుండి వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక బస్సులను ఎక్కవచ్చని ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు హైదరాబాద్, సికింద్రాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలకు ప్రయాణాలను సులభతరం చేస్తాయని పేర్కొంది. మరోవైపు బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అధిక సంఖ్యలో ప్రయాణికులు వస్తున్నందున.. భద్రతా సిబ్బంది తనిఖీలు, నిర్వహిస్తూ.. ప్రయాణికుల వస్తువులపై భద్రతకు భరోసా ఇస్తున్నారు.
Mayor Murder: 6 రోజుల క్రితమే మేయర్గా బాధ్యతలు.. ఆపై దారుణ హత్యకు గురి
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!