Instagram Fraud: అమ్మాయిల పేర్లతో నకిలీ ఖాతాలు.. న్యూడ్ ఫోటో కావాలని వేధింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Instagram Fraud: ఓ అమ్మాయి ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని వేధిస్తున్న యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్కు చెందిన బీటెక్ విద్యార్థి ఎస్.జిష్ణు కీర్తన్రెడ్డి ఇన్స్టాగ్రామ్లో నకిలీ ఫొటోలు, వివరాలను పెట్టి ఓ బాలిక పేరుతో నకిలీ ఖాతాను సృష్టించాడు. ఆ అమ్మాయి పేరుతో చాటింగ్ చేస్తూ నమ్మకం పెంచుకున్నాడు.. చాలా మంది అమ్మాయిలతో పరిచయం పెంచుకున్నాడు. తన న్యూడ్ ఫోటోలుగా పోజులిచ్చి ఇతర అమ్మాయిల ఫోటోలను సేకరించేవాడు. సేకరించిన ఫొటోలను ఆమెకు చూపిస్తూ ప్రతిరోజూ తన నగ్న చిత్రాలు, వీడియోలు పంపించాలని.. లేకుంటే తన దగ్గరున్న ఫొటోలు, వీడియోలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తానని వేధించేవాడు. దీంతో వేధింపులు తట్టుకోలేని ఓ బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసునమోదు చేసుకున్న సైబర్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడు జిష్ణుకీర్తన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అతడు చాలా మంది బాలికలను వేధించినట్లు పోలీసులు గుర్తించారు.
Read also: OTT Movie: కొత్త కాన్సెప్ట్ తో మూవీ.. ఇన్నాళ్లకు ఓటీటిలోకి..
Also Read
- Ashwini Vaishnaw: వికసిత్ భారత్-2047 లక్ష్యంతో టెక్నాలజీ విప్లవం.. హైదరాబాద్కు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.!
- Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
- MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
- Damodara Raja Narasimha : మెడికల్ ఎక్విప్మెంట్ కొనుగోళ్లకు కొత్త విధానం..
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్పాన్చాట్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన కొత్త వ్యక్తులతో స్నేహం చేయవద్దని, వారితో సమాచారం, వీడియోలు, ఫొటోలు పంచుకుని చిక్కుల్లో పడకూడదని పోలీసులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో మోసాలు ఎక్కువైపోతున్నాయి. విద్యార్థులు, యువతులు, మహిళలు ఖాతాలతో ప్రమాదం పొంచి ఉందని సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే చిత్రాలను, వ్యాఖ్యలను ‘లైక్’ చేయడం ప్రమాదాలను తెచ్చిపెడుతుందని అన్నారు. స్నేహితులతో గడిపిన సందర్భాలు, దేవాలయాలు, సినిమా థియేటర్లు, హోటళ్లు, సెలవులు, పెళ్లిళ్ల సందర్భంగా తీసిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుండటంతో సైబర్ నేరగాళ్లు వీటిని దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. ఇన్స్టాగ్రామ్ ఖాతాలోకి ప్రవేశించిన నేరగాళ్లు యువతులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. నిందితుల్లో బాధితులకు తెలిసిన వారు కూడా ఉండడం గమనార్హం అన్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ , ట్విట్టర్ లలో ఖాతాలున్న యువతులు, విద్యార్థుల వ్యక్తిగత వివరాలు, ఒంటరిగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలను నేరగాళ్లు డౌన్ లోడ్ చేస్తున్నారు. తమ చిత్రాలను అసభ్యకరంగా మార్చి ఈ ఖాతాలో పెడుతున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వస్తున్న బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. ఇప్పటికైనా యువతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Redmi Note 13 Price: రెడ్మీ నోట్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్స్ ధర, ఫీచర్లు ఇవే!
తాజావార్తలు
-
Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని పై నుంచి కిందికి ఎందుకు చెక్కారు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం!
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Akkineni Nagarjuna : అఖిల్కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
-
Sri Charani: చరిత్ర సృష్టించిన కడప బిడ్డ.. టెస్ట్ ఫార్మాట్లోకి అడుగు పెట్టిన తెలుగమ్మాయి..
-
INS Mahendragiri: భారత నౌకాదళంలోకి స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. ఆత్మనిర్భర్ భారత్కు మరో మైలురాయి
ట్రెండింగ్
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!