Auto Drivers Begging: ఫ్రీ సర్వీసులతో ఉపాధి కోల్పోయాం.. బస్సుల్లో ఆటో డ్రైవర్ల భిక్షాటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Auto Drivers Begging: బస్సుల్లో ఆటో డ్రైవర్ల భిక్షాటన చేస్తున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు రూ.100 కూడా సంపాదించలేక పోతున్నామని వాపోతున్నారు. కుటుంబం గడవాలని ఆటోలు తీసుకుని బతుకుతున్న మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఫ్రీ బస్సు సర్వీసులు ఏర్పాటు చేసిందని మండిపడుతున్నారు. తమ ఆవేదనను ప్రభుత్వానికి చెప్పిన స్పందించలేదని వాపోతున్నారు. ఇళ్లు గడవాలంటే చాలా ఇబ్బందిగా మారిందని అందకే వినూత్నంగా భిక్షాటన చేస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా ఆటోడ్రైవర్ల ఆవేదనను ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నారు. జీవనోపాధికి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఆటోలు వేసిన అందులో ఒకరో ఇద్దరు ఎక్కడం వలను ఇబ్బందిగా తయారైందని వాపోతున్నారు. సంక్రాంతి పండుగ వస్తున్నా ఆటోవాలా ఇళ్లల్లో ఆనందం కరువైందని కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వ పథకాలకు మేము పేర్లు పెట్టడం లేదని, ఆటోవాళ్ల బాధలను ప్రభుత్వం గుర్తించి ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. అందుకే ఈ భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నామని ఆటోడ్రైవర్లు వాపోతున్నారు.
Read also: ED Team: పశ్చిమ బెంగాల్లో ఈడీ బృందంపై 300 మంది దాడి
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
తెలంగాణ ఆర్టీసీ బస్సులు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. మహాలక్ష్మి పథకంలో భాగంగా డిసెంబరు 9 నుంచి వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఇప్పటి వరకు ఆటోలు, ఇతర ప్రయివేటు వాహనాల్లో ప్రయాణించే వారు ఇప్పుడు ఆర్టీసీ బస్సులకే మొగ్గు చూపుతున్నారు. దీంతో బస్సులు ఎక్కేందుకు కూడా స్థలం దొరకని పరిస్థితి నెలకొంది. మహిళలు ఎక్కువగా బస్సుల్లో ప్రయాణిస్తుండటంతో ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం తమపొట్టే విధంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రయాణికులను ఎక్కించకపోవడంతో రోజువారి ఆదాయం కోల్పోయామని.. కుటుంబాలను ఎలా పోషించుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలుమార్లు ఆటోడ్రైవర్లు నిరసనలు తెలిపారు. ప్రభుత్వ అధికారులతోనూ సమావేశమయ్యారు. తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఇవాళ తెలంగా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు భిక్షాటన చేస్తూ రేవంత్ సర్కార్ గుర్తించాలని కోరుతున్నారు. మరి సంక్రాంతి పండుగకు రేవంత్ సర్కార్ ఆటోడ్రైవర్లను ఆదుకుంటుందా? లేదో వేచి చూడాలి.
Jasprit Bumrah: తొలి భారత క్రికెటర్గా బుమ్రా అరుదైన రికార్డు.. సచిన్కు సైతం సాధ్యం కాలే!
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!