బీజేపీ గూటికి రమేష్ రాథోడ్, ఆశ్వద్ధామరెడ్డి..!
తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన భారతీయ జనతా పార్టీ.. ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.. ఇందులో భాగంగా కొంతమంది నేతలు ఇప్పటికే బీజేపీ గూటికి చేరగా.. తాజాగా, టీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. త్వరలోనే కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా కమలం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక, ఇవాళ ఈటల రాజేందర్తో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ మంతనాలు జరిపారు.. ఇదే సమయంలో.. మాజీ ఎంపీ రమేష్ రాథ్డో, ఆర్టీసీ యూనియన్ నాయకుడు అశ్వద్ధామరెడ్డి, కంటోన్మెంట్ బోర్డ్ కు చెందిన టీఆర్ఎస్ నేత కేశవ రెడ్డి కూడా ఈటల నివాసానికి వచ్చారు.. దీంతో.. వీరుకూడా టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం ఊపందుకుంది..
గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలపై అసంతృప్తితో ఉన్న ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్.. బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం మంటున్నారు.. ఇది జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టే.. ఇప్పటికే తన అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహించిన ఆయన.. వారి అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 14న మాజీ మంత్రి ఈటల రాజేందర్తో పాటు రమేష్ రాథోడ్, ఆర్టీసీ టీఎంయూ నేత ఆశ్వద్ధామరెడ్డి , కంటోన్మెంట్కు చెందిన టీఆర్ఎస్ నేత కేశవరెడ్డి కూడా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది.. ఈటల రాజేందర్ నివాసంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జీ తరుణ్ చుగ్ని కలిసి వారి అభిప్రాయాలను తెలిపినట్టు తెలుస్తోంది.. వారికి ఉన్న అనుమానాలను కూడా ఆయన ముందు పెట్టారని సమాచారం.
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!