Jagadish Reddy: పార్టీ మారకపోతే కేసీఆర్ వద్దకు రావాలి.. కానీ, రేవంత్ రెడ్డి దగ్గరకి ఎందుకెళ్లారు..?
- పార్టీ మారిన ఎమ్మెల్యేలు కేసీఆర్ దగ్గరకి రావాలి, రేవంత్ రెడ్డి వద్దకు కాదు..
- కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు తగిన శిక్ష తప్పకుండా పడుతుంది..
- స్పీకర్ పై ఒప్పతి పెట్టి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే.. ప్రజాక్షేత్రంలో తప్పించుకోలేరు: జగదీష్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagadish Reddy: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మీరు పార్టీ మారకపోతే, పార్టీ నాయకత్వంపై విశ్వాసం ఉంటే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు రావాలి.. లేదంటే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్దకు అయినా రావాలి.. కానీ, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు రాగానే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్ళినారు అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.
Read Also: Medak : మెదక్లో చిరుతతో పోరాటం, ధైర్యంగా పశువులను కాపాడిన గొర్రెల కాపరి
Also Read
ఇక, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ పై ఒత్తిడి పెట్టి సాంకేతికంగా తప్పించుకోవాలని ప్రయత్నించినా.. ప్రజల నుంచి మాత్రం తప్పించుకోలేరు అని ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అలాగే, ప్రజా క్షేత్రంలో మీకు శిక్ష తప్పదు అని విమర్శించారు. ప్రజల దృష్టిలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పుకొచ్చారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది.. లేదంటే, కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Astrology: జూలై 17 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!