Election Code: ఎన్నికల కోడ్.. రూ.50 వేలకు మించితే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Code: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను రవాణా చేసేటపుడు ఆధారాలతో సహా తీసుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. సరైన ఆధారాలు, పత్రాలు లేకుండా నగదు, బంగారం తరలిస్తే తప్పనిసరి కేసులు పెట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. చెక్కు, డీడీ, ఆర్టీజీఎస్, నిఫ్ట్, ఆన్లైన్ పద్ధతుల్లో ఖాతాలోకి నగదు బదిలీ చేసుకునే వెసులుబాటు ఉన్నా… డబ్బు ఎందుకు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో ప్రూఫ్లు సమర్పించాలి. బంగారు ఆభరణాల రవాణా విషయంలోనూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. 50,000 నగదు రవాణాకు అనుమతులు ఉన్నాయని వివరించారు. దొరికిన నగదు, బంగారం తదితరాలకు తగిన ఆధారాలు సమర్పించకుంటే ఐటీ, జీఎస్టీ, ఈడీ తదితర శాఖల అధికారులకు సమాచారం అందించి కేసు నమోదు చేస్తామన్నారు.
రూ.50వేలకు మించితే..
Also Read
♦ రూ.50 వేల వరకు మాత్రమే నగదు తీసుకెళ్లవచ్చు. ఏదైనా అదనపు మొత్తాన్ని తీసుకువెళ్లడానికి, దాని మూలానికి సంబంధించిన రుజువును కలిగి ఉండాలి. వ్యాపారులు సంబంధిత పత్రాలు మరియు లావాదేవీ బిల్లులను కలిగి ఉండాలి. సాధారణ వ్యక్తులు తీసుకువెళితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వినియోగిస్తున్నారో తెలిపేందుకు బ్యాంకు నుంచి డ్రా చేసిన పత్రాలు లేదా ఇతర అవసరమైన ఆధారాలు చూపాలి.
♦ రూ.2 లక్షలకు మించిన నగదు మార్పిడిని పోలీసులు, రెవెన్యూ, ఎన్నికల అధికారులు నిశితంగా పరిశీలిస్తారు. వారికి అంత మొత్తం ఎలా వచ్చింది? మీరు ఏమి చేయబోతున్నారు? వాళ్లు ఆధారాలు చూపించాలి. లేకుంటే నగదును పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. పట్టుబడిన నగదు రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటే అది జిల్లా ఎన్నికల అధికారి నియమించిన కమిటీకి వెళ్తుంది.
♦ నగదు యజమాని ఈ నలుగురు సభ్యుల జిల్లా కమిటీ ముందు హాజరై నగదు మూలం, అవసరాలకు సంబంధించి వివరణ ఇవ్వాలి. దీంతో కమిటీ సంతృప్తి చెందితే డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు. లేనిపక్షంలో పోలీసు శాఖకు ఫిర్యాదు చేయడం ద్వారా తదుపరి చర్యలకు ఆదేశించింది.
♦ పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు రూ.10 లక్షలు దాటితే ఆ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు నివేదించాలి. నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు బాధ్యులకు నోటీసులు జారీ చేస్తారు. వారి సమాధానాన్ని వివిధ కోణాల్లో పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటారు.
♦ కొత్త బంగారం, వెండి ఆభరణాలు, వస్తువులు, గిఫ్ట్ ఆర్టికల్స్, కుక్కర్లు, క్రికెట్ కిట్ల విలువ రూ.10 వేలు దాటితే వాటిని పోలీసులు జప్తు చేస్తారు. వ్యాపార అవసరాల కోసం తరలిస్తున్నట్లు పత్రాలు చూపి నిరూపిస్తేనే యజమానులు వాటిని తిరిగి అప్పగిస్తారు. లేదంటే విషయం ఎన్నికల అధికారుల దాకా వెళ్తుంది.
♦ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా తాము ఖర్చు చేసే ప్రచారానికి, ఇతర వస్తువులకు సంబంధించి విక్రయదారులకు రూ.10 వేలకు మించి నగదు చెల్లింపులు చేయకూడదు. అంతకు మించిన చెల్లింపులను చెక్కుల ద్వారా, ఆన్లైన్లో మాత్రమే చేయాలి. అభ్యర్థి లేదా అతని ఏజెంట్ రూ.50 వేల కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లకూడదు.
♦ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు (రూ. 50 వేల లోపు), వస్తువులు (విలువ రూ. 10,000 లోపు ఉన్నా) వాడినట్లు రుజువైతే పోలీసులు కేసు నమోదు చేస్తారు. బాధ్యులు ఐపిసిలోని 171(బి) రెడ్విత్ 171(సి)తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 123 కింద నమోదు చేయబడి, దర్యాప్తు చేయబడతారు. బాధ్యులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించే అవకాశం కూడా ఉంది.
F2 : బాలీవుడ్ లో రీమేక్ కాబోతున్న బ్లాక్ బస్టర్ మూవీ.. దర్శకుడు ఎవరంటే..?
తాజావార్తలు
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి