Celebrations of Venkateswara Swamy: నేటి నుంచే వైభవోత్సవాలు.. ఎన్టీఆర్ స్టేడియంలో ఐదురోజులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Celebrations of Lord Venkateswara Swamy: నేటి నుండి హైదరాబాద్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు అంకురార్పణ కార్యక్రమానికి హాజరైన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి జరిగే నిత్య, వారసేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా అక్టోబరు 11 (నేటి) నుండి 15వ తేదీ వరకు అయిదు రోజుల పాటు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలో అంకురార్పణ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. మంత్రికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి మంత్రి పూజలు చేశారు. అనంతరం కపిల గోవుల దర్శనం చేసుకున్నారు. తదనంతరం ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామికి జరిగే నిత్య, వార సేవలు, ఉత్సవాలను చూసే అవకాశం దక్కని లక్షలాది మంది భక్తులకు వైభవోత్సవాల ద్వారా చూసి తరించే అవకాశం లభిస్తుందన్నారు.
Read also: Manickam Tagore: నేడు నగరానికి మాణిక్కం ఠాగూర్.. జోడో యాత్ర ముగిసే వరకు రాష్ట్రంలో
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
ఈ వైభవోత్సవాలను చూసి తరించడం ఒక అదృష్టం గా భావించొచ్చనన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వ్యయా ప్రయసాలతో, సమయం తో కూడినదని ఒక్కోక్క సారి దర్శనానికి ఎన్నో గంటల సమయం పడుతుందని సాక్షాత్తు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో ఆ భగవంతుని తీసుకురావడం వల్ల ఎందరో భక్తులు చూసే స్వామి వారిని చూసే భాగ్యం కలుగుతుందన్నారు. తిరుమల లో స్వామి వారికి ప్రసాదాలు చేసి బృందాలు స్వయంగా ఇక్కడికి వచ్చాయన్నారు. 300 వరకు అర్చకులు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. గత 6 సం. ల నుండి హైదరాబాద్ లో వైభవోత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ వైభవోత్సవాలను హర్ష ఆటో గ్రూప్ ముప్పవరపు హర్షవర్ధన్, అపర్ణ గ్రూప్ ఎస్ ఎస్ రెడ్డి% శ్రీ సి. వెంకటేస్వర రెడ్డి, వంసిరామ్ బిల్డర్స్ బి.సుబ్బారెడ్డి లు 6 సం ల నుండి నిర్వహిస్తున్నారని వారికి స్వామి వారి ఆశీర్వాదాలు ఉండాలని తెలిపారు. గతంలో వైభవోత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించినట్లు తెలిపారు. వైభవోత్సవాలను 10 వేల మంది భక్తులు తిలకించేలా రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అనంతరం 5 రోజుల పూజ కార్యక్రమాల పోస్టర్ ను ఆవిష్కరించారు.
Vladimir Putin: ఉక్రెయిన్కు స్ట్రాంగ్ వార్నింగ్.. బేఖాతరు చేస్తే దబిడిదిబిడే
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!