Celebrations of Venkateswara Swamy: నేటి నుంచే వైభవోత్సవాలు.. ఎన్టీఆర్ స్టేడియంలో ఐదురోజులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Celebrations of Lord Venkateswara Swamy: నేటి నుండి హైదరాబాద్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు అంకురార్పణ కార్యక్రమానికి హాజరైన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి జరిగే నిత్య, వారసేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా అక్టోబరు 11 (నేటి) నుండి 15వ తేదీ వరకు అయిదు రోజుల పాటు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలో అంకురార్పణ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. మంత్రికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి మంత్రి పూజలు చేశారు. అనంతరం కపిల గోవుల దర్శనం చేసుకున్నారు. తదనంతరం ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామికి జరిగే నిత్య, వార సేవలు, ఉత్సవాలను చూసే అవకాశం దక్కని లక్షలాది మంది భక్తులకు వైభవోత్సవాల ద్వారా చూసి తరించే అవకాశం లభిస్తుందన్నారు.
Read also: Manickam Tagore: నేడు నగరానికి మాణిక్కం ఠాగూర్.. జోడో యాత్ర ముగిసే వరకు రాష్ట్రంలో
Also Read
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
ఈ వైభవోత్సవాలను చూసి తరించడం ఒక అదృష్టం గా భావించొచ్చనన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వ్యయా ప్రయసాలతో, సమయం తో కూడినదని ఒక్కోక్క సారి దర్శనానికి ఎన్నో గంటల సమయం పడుతుందని సాక్షాత్తు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో ఆ భగవంతుని తీసుకురావడం వల్ల ఎందరో భక్తులు చూసే స్వామి వారిని చూసే భాగ్యం కలుగుతుందన్నారు. తిరుమల లో స్వామి వారికి ప్రసాదాలు చేసి బృందాలు స్వయంగా ఇక్కడికి వచ్చాయన్నారు. 300 వరకు అర్చకులు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. గత 6 సం. ల నుండి హైదరాబాద్ లో వైభవోత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ వైభవోత్సవాలను హర్ష ఆటో గ్రూప్ ముప్పవరపు హర్షవర్ధన్, అపర్ణ గ్రూప్ ఎస్ ఎస్ రెడ్డి% శ్రీ సి. వెంకటేస్వర రెడ్డి, వంసిరామ్ బిల్డర్స్ బి.సుబ్బారెడ్డి లు 6 సం ల నుండి నిర్వహిస్తున్నారని వారికి స్వామి వారి ఆశీర్వాదాలు ఉండాలని తెలిపారు. గతంలో వైభవోత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించినట్లు తెలిపారు. వైభవోత్సవాలను 10 వేల మంది భక్తులు తిలకించేలా రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అనంతరం 5 రోజుల పూజ కార్యక్రమాల పోస్టర్ ను ఆవిష్కరించారు.
Vladimir Putin: ఉక్రెయిన్కు స్ట్రాంగ్ వార్నింగ్.. బేఖాతరు చేస్తే దబిడిదిబిడే
తాజావార్తలు
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్సైడ్ ఉందంటున్న నోమురా!
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
-
Prabhas : మలయాళం ఊచకోత డైరెక్టర్ తో ప్రభాస్?
-
Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!