Etela Rajender: మాతో గొక్కోవద్దు, ఖబడ్దార్.. ఈటల హెచ్చరిక
Etela Rajender Warns BRS Govt And CM KCR: హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో పాలన చేసే సత్తా లేదు కానీ.. కూట్లో రాయి తీయలేని వాడు ఎట్లో రాయి తియ్యడానికి పోయినట్టు.. విమానాలు వేసుకొని అన్ని పార్టీల దగ్గరికి కేసీఆర్ పోయారని ఎద్దేవా చేశారు. తనని నాయకున్ని చేయండి, దేశమంతా ఎన్నికలకు ఫండింగ్ చేస్తానని చెప్పి తిరిగొచ్చారని పేర్కొన్నారు. అయినా కేసీఆర్ను ఎవరూ నమ్మడం లేదని వ్యాఖ్యానించారు. అటు బీజేపీ కూటమి, ఇటు కాంగ్రెస్ కూటమి నమ్మక.. ఎటూ కాకుండా పోయారని కౌంటర్ వేశారు. చివరికి తెలంగాణ ప్రజలు కూడా నమ్మడం లేదని.. అందుకే డబ్బులున్నాయని, అధికారం ఉందని మిడిసిపడొద్దని హితవు పలికారు. తమ బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్.. మీ పార్టీ ఊదితే కొట్టుకుపోయే పార్టీ అని, మాతో గోక్కోవద్దు ఖబడ్దార్ అని హెచ్చరించారు.
Tulja Bhavani: తండ్రిపై మరోసారి నిప్పులు చెరిగిన తుల్జా భవాని.. మాపై కేసులు ఎందుకు?
Also Read
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
గోషామహల్లో BRS నేతలు దౌర్జన్యం చేస్తున్న సందర్భంలో బీజేపీ కార్పొరేటర్ శశికళ సముదాయించే ప్రయత్నం చేశారని.. అయితే ఆమెపై అనేక సెక్షన్ల కేసులు నమోదు చేశారని ఈటల అన్నారు. బీజేపీ కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గజ్వేల్లో అకారణంగా దాడి చేసి కొట్టారని, కేసులు పెట్టారని అసహనం వ్యక్తం చేశారు. 14 రోజులు జైల్లో పెట్టారని, ఈరోజే బెయిల్పై ఆమె బయటకొచ్చారన్నారు. మీర్పేటలో ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారని.. బీజేపీ కార్యకర్తలతో గిల్లికజ్జాలు పెట్టుకొని, బీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్లో ఓ సర్పంచ్ ను కొట్టి అకారణంగా జైల్లో పెట్టి వేధించారని పేర్కొన్నారు. అధికార పార్టీ అసహనంతోనే ఈ దాడులు చేయిస్తోందన్నారు. వీటిని కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని, ఇందుకు తగ్గ సమాధానం చెప్పే రోజు తొందరలోనే ఉందని అన్నారు. ఇదే సమయంలో.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై వేసిన వేటు తొలగింపుపై కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
తాజావార్తలు
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!