Etela Rajender: మాతో గొక్కోవద్దు, ఖబడ్దార్.. ఈటల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender Warns BRS Govt And CM KCR: హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో పాలన చేసే సత్తా లేదు కానీ.. కూట్లో రాయి తీయలేని వాడు ఎట్లో రాయి తియ్యడానికి పోయినట్టు.. విమానాలు వేసుకొని అన్ని పార్టీల దగ్గరికి కేసీఆర్ పోయారని ఎద్దేవా చేశారు. తనని నాయకున్ని చేయండి, దేశమంతా ఎన్నికలకు ఫండింగ్ చేస్తానని చెప్పి తిరిగొచ్చారని పేర్కొన్నారు. అయినా కేసీఆర్ను ఎవరూ నమ్మడం లేదని వ్యాఖ్యానించారు. అటు బీజేపీ కూటమి, ఇటు కాంగ్రెస్ కూటమి నమ్మక.. ఎటూ కాకుండా పోయారని కౌంటర్ వేశారు. చివరికి తెలంగాణ ప్రజలు కూడా నమ్మడం లేదని.. అందుకే డబ్బులున్నాయని, అధికారం ఉందని మిడిసిపడొద్దని హితవు పలికారు. తమ బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్.. మీ పార్టీ ఊదితే కొట్టుకుపోయే పార్టీ అని, మాతో గోక్కోవద్దు ఖబడ్దార్ అని హెచ్చరించారు.
Tulja Bhavani: తండ్రిపై మరోసారి నిప్పులు చెరిగిన తుల్జా భవాని.. మాపై కేసులు ఎందుకు?
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
గోషామహల్లో BRS నేతలు దౌర్జన్యం చేస్తున్న సందర్భంలో బీజేపీ కార్పొరేటర్ శశికళ సముదాయించే ప్రయత్నం చేశారని.. అయితే ఆమెపై అనేక సెక్షన్ల కేసులు నమోదు చేశారని ఈటల అన్నారు. బీజేపీ కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గజ్వేల్లో అకారణంగా దాడి చేసి కొట్టారని, కేసులు పెట్టారని అసహనం వ్యక్తం చేశారు. 14 రోజులు జైల్లో పెట్టారని, ఈరోజే బెయిల్పై ఆమె బయటకొచ్చారన్నారు. మీర్పేటలో ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారని.. బీజేపీ కార్యకర్తలతో గిల్లికజ్జాలు పెట్టుకొని, బీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్లో ఓ సర్పంచ్ ను కొట్టి అకారణంగా జైల్లో పెట్టి వేధించారని పేర్కొన్నారు. అధికార పార్టీ అసహనంతోనే ఈ దాడులు చేయిస్తోందన్నారు. వీటిని కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందని, ఇందుకు తగ్గ సమాధానం చెప్పే రోజు తొందరలోనే ఉందని అన్నారు. ఇదే సమయంలో.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై వేసిన వేటు తొలగింపుపై కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
తాజావార్తలు
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!