పోలీసుల సర్వేలోనూ 70 శాతం ఈటలదే గెలుపు..! మళ్లీ పాదయాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోలీసుల సర్వేలోనూ 70 శాతం ఈటల రాజేందరే గెలుస్తాడని తేలిందని వ్యాఖ్యానించారు బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్… రెండ్రోజుల తర్వాత మళ్లీ పాదయాత్ర చేస్తానని.. ఎక్కడ ఆపానో అక్కడే ప్రారంభిస్తా.. రెండు రోజులు హుజురాబాద్లో అందుబాటులో ఉంటా.. పరిస్థితులు సమీక్షిస్తా.. కార్యకర్తలు, నాయకులను కలుస్తా అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఈటల.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 18 ఏళ్ల చరిత్రలో సీరియస్ గా పని చేశాం.. యాక్షన్, డ్రామాలు చేసే వాళ్లం కాదు.. కన్నీళ్లు వచ్చినా, సంతోషం వచ్చినా లోపల దిగమింగుకున్నామని తెలిపారు.. నా లాంటి వాళ్ల మీద మాట్లాడడం అంటే సూరిని మీద ఉమ్మినట్టే అన్నారు ఈటల.. ఏ పదవి రాని కార్యకర్తలు పెనుగులాడుకుంటున్నారు.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ పార్టీ ఆయిన ఉండవచ్చు.. కానీ, ఈటల రాజేందర్ తో తిరిగినా, సహకరించినా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు.
నక్సలైట్లకు అన్నం పెడితే ఎలా ఇబ్బంది పెట్టారో ఇప్పుడు అలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈటల రాజేందర్.. పోలీస్ స్టేషన్ కి పిలిపించి బెదిరిస్తున్నారన్న ఆయన.. ఇవన్నీ నిలువరించే శక్తి ప్రజలకు మాత్రమే ఉందన్నారు.. ఇక, దవాత్ లేని గ్రామాలు లేవు.. ప్రలోభాలకు అప్పుడే తెరలేపారన్నారు మాజీ మంత్రి.. తాను పాదయాత్ర చేస్తున్న రూట్లలో ఫ్లెక్సీలు తొలగించి వారి ఫ్లెక్సీ లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఒకప్పుడు కక్షలు, వైషమ్యాలు లేని నియోజకవర్గం హుజురాబాద్.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు.. సర్పంచ్, ఎంపీటీసీ, పెద్ద మనిషి చెప్పితే ఓట్లు వేసి రోజులు పోయాయన్న ఆయన.. ఎందుకు ఓటు వేయాలని అనేది ప్రతీ ఒక్కరూ ఆలోచిస్తున్నారని తెలిపారు. ఓడి పోయే వాడు భయపడతాడు.. గెలుపు మీద నమ్మకం లేని వాడు అక్రమార్గంలో వస్తాడని ఎద్దేవా చేశారు ఈటల.. కాలం మూడింది… హుజురాబాద్కే పరిమితం కాదు మొత్తానికే ముప్పు వస్తుందని హెచ్చరించారు.. ఇక, సీఎం కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని.. దళిత బంధును వెంటనే అమలు చేయాలని.. హుజురాబాద్ కే కాదు రాష్ట్రం అంత అమలు చేయాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ లో ఏమీ జరుగుతుంది అనేదానిపై ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాలని కోరారు ఈటల రాజేందర్.
Also Read
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- Amulya Sri: పాపం.. హీరోయిన్ అవ్వాలని వస్తే సూసైడ్ చేసుకునేలా చేశారు!
- CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!