Etela Rajender: మాటలు గొప్పగా ఉంటాయి.. పరిహారం మాత్రం దిక్కు లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender: కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇళ్ళందకుంట మండలాల్లో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పర్యటించారు. తెగిన రోడ్లు, బ్రిడ్జి, కల్వర్ట్లు పరిశీలించారు. జమ్మికుంట హౌసింగ్ బోర్డు, ఆంబేద్కర్ కాలనీల్లో ఇండ్లు నీట మునిగి న బాధితుల పరమార్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు నీట మునిగిన బాధితుల పట్ల ప్రభుత్వ స్పందన కరువైందన్నారు. బాధితులను ఫంక్షన్ హాల్లో పెట్టి అన్నం పెట్టారని మండిపడ్డారు. పరిహారం మాత్రం దిక్కు లేదని అన్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25వేలు ఆందజేయాలని తెలిపారు. తెగిన రోడ్లు, చెరువులు, కల్వల ప్రాజెక్ట్ మరమ్మత్తులు చేపట్టాలని అన్నారు. చెరువుల కింద ఉన్న వ్యవసాయ భూములు కోతకు గురయ్యాయని అన్నారు. వ్యవసాయ భూములు తాటి చెట్టు అంత లోతు గొయ్యి పడ్డాయని తెలిపారు. ప్రభుత్వం మాటలు గొప్పగా ఉంటాయని, చేతల్లో మాత్రం ఏమి చెయ్యరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Warangal: విషాదం.. వరదల బీభత్సంతో 21 మంది మృతి.. ఏడుగురు గల్లంతు
Also Read
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతం చేశాయి. రాత్రి పగలు ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు వందలాది మంది నిరాశ్రయులు అయ్యారు. చెరువులు ఏరులై పారాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి వరద ప్రవాహానికి వాగుల్లో కొట్టుకుపోయి పలువురు మృతి చెందిన సంఘటనలు రాష్ట్రంలో అనేకం. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి హెలికాప్టర్ల సాయంతో బాధితులను రక్షించాయి. అక్కడక్కడా చెరువులు, వాగులు పొంగి పొర్లడంతో రహదారులు మూసుకుపోయాయి. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేతో పాటు రాష్ట్రంలోని పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. చాలా చోట్ల రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో వాహనాల్లో ప్రయాణించడం కష్టంగా మారింది. వర్షాలు తగ్గుముఖం పట్టినా జనజీవనం సాధారణ స్థితికి రావడానికి మరో రెండు రోజులు ఆగాల్సిందే. ఆగస్టు రెండో వారం నుంచి సెప్టెంబర్ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అయితే ఇప్పట్లో వరదలు వచ్చే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది.
Bhadrachalam: గోదావరి నీటిమట్టం 54.4 అడుగులు.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!