Etela Rajender : రెండు పార్టీలకు ఓట్లు అడిగే ముఖం లేదు.. అభ్యర్థులను పెట్టే దమ్ములేదు
- బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన కామెంట్స్
- కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు ఓట్లు అడిగే ముఖం లేదు
- అభ్యర్థులను పెట్టే దమ్ములేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఈ నెల 27న గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరుగనున్నది. రాష్ట్రంలోని అధికార విపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు ఓట్లు అడిగే ముఖం లేదు.అభ్యర్థులను పెట్టే దమ్ములేదని అన్నారు. ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు రాయితీలు ఇస్తున్నారు. అబ్దుల్ కలాంను అవమానించిన అమెరికా స్థాయి నుంచి మోడీని గౌరవించిన తీరుకు మనం చూస్తున్నాం. ఇది మోదీ విజయం అని ఈటెల తెలిపారు.
Also Read:Bandi Sanjay : ఐఏఎస్లను తప్పు చేయాలని ముఖ్యమంత్రే అంటారా..?
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
- OTR : మంత్రి శ్రీధర్బాబుతో ఎంపీ వంశీకి సెట్ అయిందా?
ఇప్పుడు స్కాములు లేవు.. మంత్రులు జైళ్లకు పోవడం లేదు. సుపరిపాలన అందిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా కొన్ని సీట్లు ఇస్తే బాగుండు అనే భావన ప్రజల్లో బలంగా పెరిగింది. కాబట్టే.. మహారాష్ట్ర హర్యానా డిల్లీలో బీజేపీని గెలిపించారు. టీచర్లకు అన్నివేళలా అండగా ఉన్నది బీజేపీ. 317 జీఓ కి వ్యతిరేకంగా కొట్లాడింది బీజేపీ. 317 జీఓ వల్ల టీచర్లు ఆత్మహత్యలు చేసుకున్నా కెసిఆర్ పట్టించుకోలేదన్నారు.పదవీ విరమణ డబ్బులు రావాలంటే 10 శాతం లంచం ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది. దాచుకున్న డబ్బులు ఇవ్వమంటే దిక్కులేదు.
Also Read:Device Tokenization Solution: ఫోన్ పే కొత్త ఫీచర్.. యూజర్లకు ఇక ఆ ఇబ్బందులుండవ్
ఐదు డి.ఏ లు పెండింగ్, 371 బాధలు పోలేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. విద్యావ్యవస్థ నాశనం అయ్యింది. ప్రైవేట్ కాలేజీలో ఫీజు రీయింబర్స్ మెంట్ కెసిఆర్ మూడేళ్లు.. రేవంత్ ఇప్పుడు సంవత్సరన్నరగా పెండింగ్ పెట్టారు. డబ్బులు విడుదల చేయమంటే రేవంత్ సెటిల్మెంట్ కి రమ్మంటున్నారట. ఇంతకంటే నీచం ఏమన్నా ఉందా ? అని ఈటెల ప్రశ్నించారు. నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీలు నడపలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే మూకుమ్మడిగా బీజేపీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఈటెల వెల్లడించారు.
తాజావార్తలు
-
Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..