ప్రముఖ ఆన్ లైన్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. పేమెంట్స్ సెక్యూర్ గా ఉండేందుకు, మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఫోన్ పే కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. సురక్షితమైన కార్డ్ ట్రాన్సాక్షన్స్ కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్ ను ప్రారంభించింది. క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం ఈ ఫీచర్ ను తీసుకొచ్చినట్లు ఫోన్ పే ప్రకటించింది. యూజర్లు ఫోన్ పే యాప్ లో తమ కార్డులను టోకనైజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా బిల్లు చెల్లింపులు, రీఛార్జ్ లు, ప్రయాణ టిక్కెట్ బుకింగ్, బీమా కొనుగోలు, పిన్ కోడ్ ఆధారంగా చెల్లింపులు చేసుకోవచ్చు.
Also Read:Payal Rajput : పాయల్ అలా నవ్వితే.. కుర్రాళ్ల గుండెలు పేలిపోవా చెప్పు
యూజర్లు తమ కార్డులను టోకనైజ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందొచ్చు. ఫోన్ పే కస్టమర్లు ఇకపై ప్రతి లావాదేవీకి తమ కార్డు వివరాలను మర్చంట్ ప్లాట్ ఫామ్ లలో సేవ్ చేయాల్సిన అవసరం లేదు. సీవీవీ వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేదని ఫోన్ పే తెలిపింది. టోకనైజ్డ్ కార్డులను ఫోన్ కు సురక్షితంగా అనుసంధానించడంతో మోసాల బారిన పడకుండా ఉంటుంది. దీని ద్వారా కస్టమర్లకు ఆన్ లైన్ చెల్లింపులపై విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రారంభంలో కస్టమర్లు వీసా క్రెడిట్, డెబిట్ కార్డులను టోకనైజ్ చేసుకోవచ్చని ఫోన్ పే తెలిపింది. ఫోన్ పే చెల్లింపు గేట్ వే సేవలు అనుసంధానించబడిన ఆన్ లైన్ వ్యాపారుల వద్ద కూడా కార్డును టోకనైజ్ చేయొచ్చు.