Etela Rajender : రెండు పార్టీలకు ఓట్లు అడిగే ముఖం లేదు.. అభ్యర్థులను పెట్టే దమ్ములేదు
- బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన కామెంట్స్
- కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు ఓట్లు అడిగే ముఖం లేదు
- అభ్యర్థులను పెట్టే దమ్ములేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఈ నెల 27న గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరుగనున్నది. రాష్ట్రంలోని అధికార విపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు ఓట్లు అడిగే ముఖం లేదు.అభ్యర్థులను పెట్టే దమ్ములేదని అన్నారు. ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు రాయితీలు ఇస్తున్నారు. అబ్దుల్ కలాంను అవమానించిన అమెరికా స్థాయి నుంచి మోడీని గౌరవించిన తీరుకు మనం చూస్తున్నాం. ఇది మోదీ విజయం అని ఈటెల తెలిపారు.
Also Read:Bandi Sanjay : ఐఏఎస్లను తప్పు చేయాలని ముఖ్యమంత్రే అంటారా..?
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
- US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
ఇప్పుడు స్కాములు లేవు.. మంత్రులు జైళ్లకు పోవడం లేదు. సుపరిపాలన అందిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా కొన్ని సీట్లు ఇస్తే బాగుండు అనే భావన ప్రజల్లో బలంగా పెరిగింది. కాబట్టే.. మహారాష్ట్ర హర్యానా డిల్లీలో బీజేపీని గెలిపించారు. టీచర్లకు అన్నివేళలా అండగా ఉన్నది బీజేపీ. 317 జీఓ కి వ్యతిరేకంగా కొట్లాడింది బీజేపీ. 317 జీఓ వల్ల టీచర్లు ఆత్మహత్యలు చేసుకున్నా కెసిఆర్ పట్టించుకోలేదన్నారు.పదవీ విరమణ డబ్బులు రావాలంటే 10 శాతం లంచం ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది. దాచుకున్న డబ్బులు ఇవ్వమంటే దిక్కులేదు.
Also Read:Device Tokenization Solution: ఫోన్ పే కొత్త ఫీచర్.. యూజర్లకు ఇక ఆ ఇబ్బందులుండవ్
ఐదు డి.ఏ లు పెండింగ్, 371 బాధలు పోలేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. విద్యావ్యవస్థ నాశనం అయ్యింది. ప్రైవేట్ కాలేజీలో ఫీజు రీయింబర్స్ మెంట్ కెసిఆర్ మూడేళ్లు.. రేవంత్ ఇప్పుడు సంవత్సరన్నరగా పెండింగ్ పెట్టారు. డబ్బులు విడుదల చేయమంటే రేవంత్ సెటిల్మెంట్ కి రమ్మంటున్నారట. ఇంతకంటే నీచం ఏమన్నా ఉందా ? అని ఈటెల ప్రశ్నించారు. నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీలు నడపలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే మూకుమ్మడిగా బీజేపీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఈటెల వెల్లడించారు.
తాజావార్తలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త సుమీ!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 160 మంది మృతి, 750 మందికి పైగా గల్లంతు
-
NTR Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ క్రేజీ అప్డేట్.. ఫ్లాష్బ్యాక్లో ఊహించని ట్విస్ట్!
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..