Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Essentials Leading Company Names

Hyderabad: బ్రాండెడ్‌ ముసుగులో నాసిరకం సరుకు.. కాటేదాన్‌లో తయారీ, నాగారంలో నిల్వ

Published Date :February 25, 2024 , 8:42 am
By Bhanu
Hyderabad: బ్రాండెడ్‌ ముసుగులో నాసిరకం సరుకు.. కాటేదాన్‌లో తయారీ, నాగారంలో నిల్వ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hyderabad: నగరంలోని వివిధ మార్కెట్లలో లభించే ముడిసరుకుతో నిత్యావసరాల నాసిరకం తయారీ విచ్ఛలవిడిగా సాగుతుంది. ఉత్తరాది నుంచి తీసుకొచ్చిన ప్రముఖ కంపెనీల పేర్లతో కూడిన బాక్సుల్లో ప్యాకింగ్ చేసి ప్రజల జీవితాలతో చలగాటం ఆడుతున్నారు. నగర శివారులోని కిరాణా దుకాణాల ద్వారా బ్రాండెడ్ వస్తువుల పేర్లతో విక్రయాలు చేస్తుండటంతో.. అదే బ్రాండెడ్ అని భావించి ప్రజలు దానిని తీసుకుని అనారోగ్యాలకు గురవుతున్నారు. దీనిపై దృష్టి పెట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఘరానా ముఠా సాగిస్తున్న దందాను గుట్టు రట్టు చేశారు. ఆరుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని అరెస్టు చేశామని, వారి నుంచి రూ.2 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని టాస్క్‌ఫోర్స్ డీసీపీ ఎస్.రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈస్ట్ జోన్ డీసీపీ ఆర్.గిరిధర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు.

Read also: West Bengal : మార్చి 1 నుండి బెంగాల్‌లో 100 కంపెనీల సెంట్రల్ ఫోర్స్.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

Also Read

  • CM Revanth Reddy : కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
  • Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
  • Fire Accident : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
  • KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!

ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి… ఎన్నో కేసులు…

రాజస్థాన్‌కు చెందిన శ్యామ్ బాటి, కమల్ బాటి జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చి కాచిగూడ ప్రాంతంలో స్థిరపడ్డారు. తొలినాళ్లలో, ఇద్దరూ కిరాణా వ్యాపారం చేసి, సులభంగా డబ్బు సంపాదించడానికి బేగంబజార్‌కు చెందిన జయరామ్‌తో జతకట్టారు. బ్రాండెడ్ వస్తువుల పేరుతో నాసిరకం వస్తువులను ప్యాకింగ్ చేసి విక్రయించాలని ముగ్గురు ప్లాన్ చేసుకున్నారు. గుజరాత్, బెంగళూరు, ఢిల్లీ నుంచి నాసిరకం ముడిసరుకును కొనుగోలు చేస్తున్నారు. కాచిగూడలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో వీటిని ప్రాసెస్ చేసి… బెంగళూరు, ఢిల్లీ, నాసిక్ నుంచి తీసుకొచ్చిన వివిధ బ్రాండ్ పేర్లతో కవర్లు, డబ్బాలు, బాక్సుల్లో నింపి మార్కెట్ లో విక్రయిస్తున్నారు. 2019, 2022లో కాచిగూడ, మైలార్‌దేవ్‌పల్లి, నల్గొండలో కూడా కేసులు నమోదయ్యాయి. తెరవెనుక ఉండిపోయిన ముగ్గురు తమ స్నేహితుడు మహేందర్ సింగ్ ను రంగంలోకి దించారు. రాజస్థాన్‌కు చెందిన అతను నాగారంలో కిరాణా వ్యాపారం చేస్తున్నాడు. బ్రాండెడ్ కవర్లలో ముడిసరుకును ప్యాక్ చేసేందుకు కాటేదాన్ వద్ద ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు.

Read also: Multibagger Stock : రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ.3లక్షలు.. 3000శాతం రాబడి ఇచ్చిన షేర్ ఏదో తెలుసా ?

మిథులేష్‌ కుమార్‌, త్రియాన్‌ కుమార్‌ నేతృత్వంలో స్థానికులకు ఉపాధి కల్పిస్తూ వీటిని ప్యాకింగ్‌ చేస్తున్నారు. ఇలా తయారైన నిత్యావసర వస్తువులను దాచేందుకు మహేందర్ ఇంటి సమీపంలో గోదామును అద్దెకు తీసుకున్నారు. ముందుగా సరుకు మొత్తం ఇక్కడికి తీసుకొచ్చి… తర్వాత శివారు ప్రాంతాల్లోని కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తారు. వీటిలో నాణ్యత లేని వస్తువులతో పాటు అనుమానిత నకిలీ వస్తువులు కూడా ఉన్నాయి. వారి కేసును మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించారు. ఇన్ స్పెక్టర్ బి.రాజునాయక్ ఆధ్వర్యంలో ఇన్ స్పెక్టర్ ఎస్ .సాయికిరణ్ , కాచిగూడ ఇన్ స్పెక్టర్ ఎస్ ఆర్ ఎల్ రాజు తమ బృందాలతో దాడులు నిర్వహించారు. సరుకుతో అక్కడికి వచ్చిన మహేందర్ పట్టుకోగా… గోదాం, ఫ్యాక్టరీ విషయాలు వెలుగు చూశాయి. దీంతో వారిద్దరిపై దాడి చేసిన పోలీసులు.. మిథులేష్, ట్రయాన్ లను పట్టుకుని రూ.2 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సూత్రధారుల కోసం వేట సాగిస్తున్న ఈ అధికారుల నెట్‌వర్క్‌లో ఇంకెవరు ఉన్నారు? అనే అర్థంలో విచారిస్తున్నారు.
Drugs : రూ.2000కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. పరారీలో సినీ నిర్మాత

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Essential Goods
  • hyderabad
  • Hyderabad katadaan
  • leading companies
  • task force police

తాజావార్తలు

  • DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..

  • Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??

  • Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..

ట్రెండింగ్‌

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions