Drugs : రూ.2000కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. పరారీలో సినీ నిర్మాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs : నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) హెడ్క్వార్టర్స్, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్తో కలిసి సంయుక్త ఆపరేషన్లో పెద్ద అంతర్జాతీయ డ్రగ్స్ కార్టెల్ నెట్వర్క్ను ఛేదించినట్లు పేర్కొంది. ఈ ముఠాలోని ముగ్గురిని అరెస్టు చేయడంతో పాటు డ్రగ్స్ తయారీకి ఉపయోగించే 50 కిలోల సూడోపెడ్రిన్ రసాయనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎన్సిబి అధికారులు శనివారం తెలిపారు. అరెస్టయిన ముగ్గురు నిందితులు తమిళనాడు వాసులు. డ్రగ్ నెట్వర్క్ భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియాలో విస్తరించి ఉందని ఎన్సిబి ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆపరేషన్లో ఢిల్లీలో ముగ్గురిని అరెస్టు చేసి 50 కిలోల సూడోఎఫెడ్రిన్ను స్వాధీనం చేసుకున్నారు. మెథాంఫెటమైన్ తయారీలో సూడోఎఫెడ్రిన్ ఉపయోగించబడుతుంది.
ఈ రసాయనాన్ని హెల్త్ మిక్స్ పౌడర్, ఎండు కొబ్బరి తదితర ఆహార ఉత్పత్తుల ముసుగులో దాచి గాలి, సముద్ర సరుకుల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. ఈ ముఠా సూత్రధారి పరారీలో ఉన్న తమిళ సినీ నిర్మాతగా గుర్తించామని అధికార ప్రతినిధి తెలిపారు. సూడోఎఫెడ్రిన్ మూలాన్ని గుర్తించేందుకు వీలుగా అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మొత్తం అంతర్జాతీయ నెట్వర్క్ గురించి న్యూజిలాండ్ కస్టమ్స్ అధికారులు, ఆస్ట్రేలియా పోలీసుల నుండి సమాచారం అందిందని, ఎండు కొబ్బరి పొడిలో దాచి పెద్ద మొత్తంలో సూడోపెడ్రిన్ రెండు దేశాలకు పంపుతున్నట్లు ఆయన చెప్పారు. యునైటెడ్ స్టేట్స్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ నుండి వచ్చిన ఇన్పుట్లు ఈ డ్రగ్స్ సరుకుకు మూలం ఢిల్లీ అని సూచిస్తున్నాయి.
Also Read
Read Also:Multibagger Stock : రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ.3లక్షలు.. 3000శాతం రాబడి ఇచ్చిన షేర్ ఏదో తెలుసా ?
సూడోఎఫెడ్రిన్తో తయారైన మెథాంఫెటమైన్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉన్న డ్రగ్ అని, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో కిలో రూ. 1.5 కోట్లకు విక్రయిస్తున్నట్లు ప్రకటన పేర్కొంది. డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను పట్టుకునేందుకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, ఎన్సీబీ సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎన్సీబీ, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ బృందాలు నాలుగు నెలల పాటు సాంకేతిక, క్షేత్రస్థాయిలో తీవ్ర నిఘా పెట్టి, ఈ ముఠా నిర్వాహకులు మళ్లీ ఢిల్లీలో ఉన్నారని, మరో డ్రగ్స్ను ఆస్ట్రేలియాకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారని తేలిందని ఆ ప్రకటన పేర్కొంది. నిందితులను వెతకడానికి ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం 24 గంటల పాటు తీవ్ర నిఘా పెట్టిందని.. చివరికి పశ్చిమ ఢిల్లీలోని బసాయి దారాపూర్లోని వారి గిడ్డంగికి దారితీసిందని NCB ప్రతినిధి తెలిపారు.
అన్ని లింక్లను కనుగొన్న తరువాత, NCB, ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ ఫిబ్రవరి 15 న పశ్చిమ ఢిల్లీలోని బసాయి దారాపురా ప్రాంతంలోని ఒక గోదాముపై దాడి చేసి, అక్కడ నుండి బస్తాల్లో నిల్వ ఉంచిన 50 కిలోల సూడోపెడ్రిన్ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రతినిధి తెలిపారు. ఈ ముఠాలోని ముగ్గురిని అక్కడికక్కడే అరెస్టు చేసినట్లు తెలిపారు. నిరంతర విచారణ అనంతరం గత 3 ఏళ్లలో మొత్తం 45 సరుకులు పంపామని, అందులో దాదాపు 3500 కిలోల సూడోఎఫెడ్రిన్ ఉందని, దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.2000 కోట్లకు పైగా ఉంటుందని వెల్లడించాడు. మొత్తం నెట్వర్క్ను ఛేదించేందుకు ఆయా దేశాల్లో ఉన్న కార్యకర్తలను అరెస్టు చేసేందుకు ఎన్సిబి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అధికారులను సంప్రదించిందని ప్రతినిధి తెలిపారు.
Read Also:West Bengal : మార్చి 1 నుండి బెంగాల్లో 100 కంపెనీల సెంట్రల్ ఫోర్స్.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!