West Bengal : మార్చి 1 నుండి బెంగాల్లో 100 కంపెనీల సెంట్రల్ ఫోర్స్.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal : లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ బృందం మొత్తం ఇంకా పశ్చిమ బెంగాల్కు చేరుకోలేదు. అయితే ఎన్నికలకు ముందు హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున మార్చి 1 నుండి పశ్చిమ బెంగాల్లో 100 కంపెనీల సెంట్రల్ ఫోర్స్ని మోహరిస్తారు. ఆ తర్వాత మార్చి 7న మరో 50 కంపెనీ బలగాలు రానున్నాయి. ఈ విధంగా మార్చి మొదటి వారంలో 150 కంపెనీల కేంద్ర బలగాలు బెంగాల్ చేరుకోనున్నాయి. రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఏరియా డామినేషన్ కు శ్రీకారం చుట్టనున్నట్లు అందుతున్న సమాచారం. ఎన్నికల ప్రకటనకు ముందు ఇంతగా కేంద్ర బలగాలు గతంలో ఎన్నడూ రాలేదు. నిస్సందేహంగా ఎన్నికల సంఘం ఈ చర్య అపూర్వమని రాజకీయ నిపుణులు అంటున్నారు.
అయితే ఈ దళం ఎలా పని చేస్తుందో, ఎవరి అధీనంలో పని చేస్తుందో ఎన్నికల సంఘం ఇంకా స్పష్టంగా చెప్పలేదు. మార్చి తొలివారంలో ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో 80 వేలకు పైగా బూత్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి ప్రతి బూత్లోనూ ఓటింగ్ జరగనుంది. జాతీయ ఎన్నికల సంఘం ఫుల్ బెంచ్ మార్చి 3న రానుంది. ఫుల్ బెంచ్ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఎన్నికల ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమావేశం కానున్నారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల పరిస్థితిని కూడా పరిశీలిస్తారు. అదేవిధంగా ఎన్ని కేంద్ర బలగాలు, ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవలసి ఉంటుంది? దీనికి సంబంధించిన ముసాయిదా కూడా సిద్ధం కానుంది.
Also Read
- Astrology: జూలై 18 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
Read Also:Oppo F25 Pro 5G : ఒప్పో F25 Pro 5G వచ్చేస్తుంది.. ఫీచర్స్, ధర ఎంతంటే?
గత ఏడాది 2023లో జరిగిన పంచాయితీ ఎన్నికలలో రాజకీయ హింస పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేసింది. 2023 పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలలో అనేక జిల్లాల్లో విస్తృతమైన హింస జరిగింది. ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలను మోహరించినప్పటికీ, అంతర్గత, పార్టీల మధ్య జరిగిన ఘర్షణల్లో 40 మందికి పైగా మరణించారు. అదేవిధంగా గత నెల నార్త్ 24 పరగణాస్లోని సందేశ్ఖాలీ ప్రాంతంలోని టిఎంసి నాయకుడు షాజహాన్ షేక్ ఇంటిపై దాడి చేయడానికి వెళ్లిన ఇడి అధికారులు దాడి చేశారు. ఆ తర్వాత షాజహాన్ షేక్, అతని సహచరులు మహిళలను చిత్రహింసలకు గురిచేస్తున్నారని మహిళలు ఆరోపించారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆందోళన కొనసాగుతోంది. ఈమేరకు ఎన్నికల సంఘం కేంద్ర హోంశాఖకు లేఖ ఇచ్చింది. ఈ లేఖలో 2024 లోక్సభ ఎన్నికల కోసం పశ్చిమ బెంగాల్లో గరిష్టంగా 920 కంపెనీలను మోహరించాలని డిమాండ్ చేయగా, జమ్మూ కాశ్మీర్లో 635 కంపెనీలను మోహరించడం గురించి మాట్లాడటం జరిగింది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు దశలవారీగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో గరిష్టంగా 3,400 కంపెనీల CAPFలను మోహరించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
CAPF కంపెనీలో దాదాపు 100 మంది సైనికులు, ఉద్యోగులు ఉంటారు. పశ్చిమ బెంగాల్లో దాదాపు 920 CAPF కంపెనీలను దశలవారీగా మోహరించాలని ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. CAPFలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశాస్త్ర సీమా బల్ (SSB), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) ఉన్నాయి.
Read Also:Gold Price Today : గుడ్ న్యూస్.. స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
తాజావార్తలు
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
-
Astrology: జూలై 18 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?