Jeevan Reddy : తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపు చోటుచేసుకోబోతోంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆ పార్టీకి భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. హస్తం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి (T. Jeevan Reddy) త్వరలోనే కాంగ్రెస్కు రాజీనామా చేసి, బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ జెండా మోసిన ఒక…
MLA Disqualification Petitions: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కొనసాగుతున్న విచారణ నేటితో ముగియనుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు తన ఛాంబర్లో కీలక విచారణ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా రెండు కీలక పిటిషన్లపై తుది వాదనలు వినిపించబడనున్నాయి. మొదటగా కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్ ను స్పీకర్ విచారించనున్నారు. కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ను వివేకానంద దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు వాదనలు వినిపించగా.. ఇవాళ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్…
Harish Rao: క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకు మాజీ శాసనసభ్యులు, దళిత నాయకుడు బాల్క సుమన్ను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. క్యాతన్ పల్లిలో బీఆర్ఎస్కి పూర్తి మెజారిటీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన తీరు చూసి యావత్ తెలంగాణ అసహ్యించుకుంటున్నదన్నారు. అధికార బలం, పోలీసు బలం, ధన బలంతో…
ఉత్కంఠకు తెరదించుతూ తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం జరిగిన హోరాహోరీ పోరులో చివరకు అదృష్టం కాంగ్రెస్ అభ్యర్థిని వరించింది. అయితే, తన రాజకీయ కంచుకోటగా భావించే తొర్రూరు మున్సిపాలిటీ చేజారిపోవడంతో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర భావోద్వేగానికి లోనై మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో ఇరు వర్గాల బలాబలాలు సమానంగా ఉండటంతో అధికారులు ‘లక్కీ డ్రా’ పద్ధతిని…
Harish Rao: అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్కు మాజీమంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. శాసనసభ నిబంధనలను పట్టించుకోకుండా అసెంబ్లీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని పేర్కొన్నారు. "రెండేళ్లు గడిచినా హౌస్ కమిటీల ఊసే లేదు. డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని గాలికి వదిలేశారు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తున్నారు. రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదు. ఏడాదికి కనీసం 30 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలి. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ నిర్వహణను సరిదిద్దాలి.
Kishan Reddy: ఓటు వేయక పోతే సన్న బియ్యం, ఫ్రీ బస్ ఆగిపోతుంది అని సీఎం అన్నారు.. సన్నబియ్యంలో కేంద్ర ప్రభుత్వానిదే సింహభాగం.. ఏ విధంగా సీఎం ఆపుతారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు. సకల సమస్యలకు పరిష్కారం ఫ్రీ బస్సు అనే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన నిధులను, వచ్చిన సంస్థల వివరాలు కిషన్రెడ్డి వివరించారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో బీబీనగర్ ఎయిమ్స్ భవనాలు…
Alleti Maheshwar Reddy : బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, ఆమె అసంతృప్తి అనేది గత కొంతకాలంగా బయటపడుతోందని, ఇది ఇక బహిరంగంగానే మారిపోయిందని పేర్కొన్నారు. కవిత ఇటీవల పార్టీకి రాసిన లేఖలో తనకు జరిగిన అన్యాయాన్ని స్పష్టంగా ప్రస్తావించారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. BRS పార్టీలో తన పాత్రను పూర్తిగా విస్మరిస్తున్నారనే అభిప్రాయం ఆమెలో ఉందని, కేటీఆర్కు…