Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Karimnagar Encounter Between Police And Naxalites At Koyyur 23 Years Ago

Koyyur Encounter: మావోయిస్టు చరిత్రలో నెత్తుటి జ్ఞాపకం.. కొయ్యూర్ ఎన్‌కౌంటర్‌కు 23 ఏళ్లు

Published Date :December 2, 2022 , 12:04 pm
By Venu Goapl Reddy
Koyyur Encounter: మావోయిస్టు చరిత్రలో నెత్తుటి జ్ఞాపకం.. కొయ్యూర్ ఎన్‌కౌంటర్‌కు 23 ఏళ్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Encounter between police and Naxalites at Koyyur 23 years ago: నక్సలైట్స్ ఉద్యమ చరిత్రలోనే నెత్తుటి జ్ఞాపకంగా నిలిచింది కొయ్యూర్ ఎన్‌కౌంటర్. మావోయిస్టులకు భారీ దెబ్బగా భావిస్తుంటారు. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూర్ గ్రామం( ఒకప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా)వద్ద 1999 డిసెంబర్ 2న పోలీసులు, పీపుల్స్ వార్ దళాల మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పీపుల్స్ వార్ ముగ్గురు కీలక నేతలను కోల్పోయింది. అప్పటి కేంద్ర కమిటీ సభ్యుడు నల్లా ఆదిరెడ్డ, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి శీలం నరేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రం సంతోష్ రెడ్డిలు నేలకొరిగారు. ఈ ముగ్గురి వీరమరణం మావోయిస్టు ఉద్యమంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది.

ఎన్‌కౌంటర్ పై అనుమానాలు:

అయితే ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని ప్రజా సంఘాలు ఆరోపిస్తుంటాయి. బెంగళూర్ నగరంలో వీరు ముగ్గురిని డిసెంబర్ 1న పట్టుకుని చిత్ర హింసలు పెట్టి బూటకపు ఎన్ కౌంటర్ లో పోలీసులు హతమార్చినట్లు పౌరహక్కుల సంఘాలు ఆరోపిస్తుంటాయి. ఈ భారీ ఎన్ కౌంటర్ కు ముందు నక్సలైట్లు 1999 ఏప్రిల్‌ 13న మహదేవపూర్‌ మండలం అన్నారం అడవుల్లో మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావును కాల్చి చంపారు. దీనికి ప్రతిగానే పోలీసులు ఈ ఎన్ కౌంటర్ చేశారని అంటుంటారు.

Read Also: Himanta Biswa Sarma: “లవ్ జీహాద్” వాస్తవం.. దీనికి శ్రద్ధావాకర్ కేసు ఓ ఉదాహరణ..

మావోయిస్టు పార్టీకి బీజం:

ఈ ఎన్ కౌంటర్ తరువాత నక్సలైట్ ఉద్యమంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. వీరి జ్ఞాపకార్థం పీపుల్స్ గెరిల్లా ఆర్మీ(పీజీఏ) ఏర్పడింది. 2000 డిసెంబర్ 2న దీన్ని ఏర్పాటు చేసింది పీపుల్స్ వార్. ప్రతీ ఏటా డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 8 వరకు పీజీఏ వారోత్సవాలు నిర్వహిస్తుంటారు మావోయిస్టులు. వీరి జ్ఞాపకార్థం పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ వద్ద 2004లో మావోయిస్టు పార్టీ భారీ స్థూపాన్ని నిర్మించింది. ఆ తరువాత పీపుల్స్ వార్ గ్రూపులో ఎంసీసీఐ, విప్లవ సమాఖ్య వంటి తదితర నక్సల్ గ్రూపులు విలీనం అయ్యాయి. దీంతో అప్పటి నుంచి పీపుల్స్ వార్ కాస్తా మావోయిస్టు పార్టీగా మారింది. దీంతో పాటు పీపుల్స్ గెరిల్లా ఆర్మీ(పీజీఏ) పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ( పీజీఎల్ఏ)గా మారింది.

Read Also: Maharashtra: తండ్రిపై కోపంతో.. మైనర్ బాలికపై 15 ఏళ్ల బాలుడి అత్యాచారం, హత్య

సరిహద్దుల్లో అలజడి:

తెలంగాణ ప్రాంతంలో మళ్లీ బలపడాలని మావోయిస్టు పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ సరిహద్దు జిల్లాలైన భూపాలపల్లి, ములుగులతో పాటు కుమ్రంభీం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అడపాదపా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. పలు సందర్భాల్లో ఈ జిల్లాల్లో మావోయిస్టు సానుభూతిపరులు అరెస్టు అవుతుంటారు. భూపాలపల్లి జిల్లా పలిమెల, మహాదేవాపూర్, మహాముత్తారం మండలాల్లో మావోయిస్టు కదలికలు ఉన్నాయి. దీంతో పాటు ములుగు జిల్లా ఏటూర్ నాగారం, వాజేడు, వెంకటాపూర్ మండలాలను మావోలు షెల్టర్ జోన్ గా ఉపయోగించుకుంటున్నట్లు సమాచారం.

ఈ రెండు జిల్లాలను ఆనుకుని మావోయిస్టు ప్రభావిత జిల్లాలు అయిన మహారాష్ట్రలోని గడ్చిరోలి, చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలు ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో మళ్లీ ఉద్యమాన్ని విస్తరించే ఆలోచనలో ప్రయత్నాలు చేస్తున్నారు మావోయిస్టులు. ప్రస్తుతం పీజీఎల్ఏ వారోత్సవాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలెర్ట్ నెలకొంది. దీంతో గోదావరి పరివాహక అటవీ ప్రాంతాలతో పాటు ఏజెన్సీ గ్రామాలు, అంతరాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు నిఘాను పెంచారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • jayashankar bhupalapally
  • karimnager
  • koyyur encounter
  • Maoist party
  • Naxalites movement

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions