కేసీఆర్ ధర్మాన్ని వదిలేసాడు.. ప్రగతి భవన్ కు వెళ్తే లోపలికి రానివ్వలేదు : ఈటల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మంత్రులు చేసిన వాఖ్యలపై ఈటల ఫైర్ అయ్యారు. ఐఏఎస్ అధికారులు దారుణంగా విచారణ చేశారు.. నాకు నోటీసులు కూడా ఇవ్వలేదు.. దేశ చరిత్రలో ఇలాంటి కుట్ర పూరితంగా ఎవరూ వ్యవహరించ లేదని మండిపడ్డారు. వ్యక్తులు ఉంటారు, పోతారు కానీ.. ధర్మము ఎక్కడికి పోదు ప్రభుత్వం దుర్మార్గముగా వ్యవహరిస్తోందన్నారు. సీఎం కెసిఆర్ చట్టాన్ని, ధర్మాన్ని, చివరికి ఉద్యమాన్ని కూడా అమ్ముకున్నాడని..పార్టీకి వ్యతిరేక పనులు నేనెప్పుడూ చేయలేదన్నారు ఈటల. నేను ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదు..నాపై విమర్శలు సరికాదని పేర్కొన్నారు. ఎవరి చరిత్ర ఏంటో నాకు బాగా తెలుసు.. ప్రగతి భవన్ కు వెళ్తే లోపలికి రానివ్వలేదని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ద్వారా త్వరలోనే బదులిస్తా.. న్యాయం జరుగుతుందని తెలిపారు ఈటల. మంత్రులు గంగుల, కొప్పుల వ్యాఖ్యలు దారుణమన్నారు. పోటీ ఉన్నా కేసీఆర్ టికెట్ ఇచ్చారు.. కరీంనగర్ జిల్లాను ఆనాడు కాపాడింది కమలపూర్ అని గుర్తు చేశారు. మంత్రుల కామెంట్స్ వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని..చేసిన దందాలన్నీ ఎప్పటికైనా బయటపడతాయన్నారు. 2014 నుండి కేసీఆర్ ధర్మాన్ని వదిలేసాడని.. గొప్ప వ్యక్తిగా ఉండే కేసీఆర్ ఎవరి సలహాలు వల్లనో మంత్రులను చులకన చేస్తూ ఎమ్మెల్యేలను అవమానించేలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో కరీంనగర్ జిల్లా మొత్తం నేనే చూసుకునే వాణ్ణి.. ఒక సమస్య మీద ప్రగతి భవన్ కి వెళితే అక్కడ గేట్ దగ్గరే ఆగిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రిక్వెస్ట్ చేసినా సెక్యూరిటీ ఆపారు.. అప్పుడు గంగుల కమలాకర్ నే ఇంత దుర్మార్గం ఉంటదా అన్న అని అన్నడని తెలిపారు. ఇక అన్ని పార్టీల నాయకులతో మాట్లాడతా.. వేరే పార్టీల వాళ్ళతో మాట్లాడితే తప్పు అయిందా అని మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ని జమ్మికుంట కు నీళ్లు కావాలని చెప్పడం కోసం కలవడానికి వెళ్లినా.. నేను దద్దమ్మను కాదన్నారు.
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
- Tags
- cm kcr
- eetala rajender
- ktr
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!