NTV జర్నలిస్టుల అక్రమ అరెస్టులపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ( EGI ) ఆందోళన
- NTV జర్నలిస్టుల అరెస్టులపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన
- ఇద్దరు జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని ఖండించిన ఎడిటర్స్ గిల్డ్
- పోలీసులు అనవసరమైన తొందర చూపారని అభిప్రాయపడ్డ గిల్డ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసిన తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని అత్యున్నత మీడియా సంస్థ అయిన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (EGI) ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. ఫేక్ న్యూస్ ప్రచారం చేశారనే అభియోగాలతో ఎన్టీవీకి చెందిన ఇద్దరు జర్నలిస్టులను అర్ధరాత్రి వేళ హడావుడిగా అరెస్టు చేసిన విధానాన్ని గిల్డ్ తీవ్రంగా ఖండించింది. ఈ అరెస్టుల విషయంలో పోలీసులు తీవ్రమైన అత్యుత్సాహం ప్రదర్శించారని, కోర్టు బెయిల్ మంజూరు చేసే వరకు వారిని లాకప్లో ఉంచడం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది.
PM Modi: ‘‘మహా జంగిల్ రాజ్’’.. మమతా బెనర్జీ పాలనపై ప్రధాని మోడీ ఫైర్..
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
ముఖ్యంగా ఒక ఐఏఎస్ అధికారి బదిలీకి సంబంధించిన వార్త ప్రచురించినందుకు జర్నలిస్టులపై ఇలాంటి దూకుడు చర్యలకు పాల్పడటం మీడియా స్వేచ్ఛను అణచివేయడమేనని గిల్డ్ తన లేఖలో ఘాటుగా విమర్శించింది. ఈ అరెస్టులకు ముందు పోలీసులు కనీస న్యాయ ప్రక్రియను పాటించలేదని, సమగ్ర దర్యాప్తు జరిపిన తర్వాతే చర్యలు తీసుకోవాల్సిందని ఎడిటర్స్ గిల్డ్ అభిప్రాయపడింది. ఇలాంటి అధికార దుర్వినియోగం వల్ల స్వతంత్రంగా పనిచేసే మీడియా సంస్థల్లో భయాందోళనలు నెలకొంటాయని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హెచ్చరించింది.
తెలంగాణలో మీడియా ప్రతినిధులు ఎటువంటి అడ్డంకులు లేకుండా, స్వేచ్ఛగా తమ బాధ్యతలు నిర్వహించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రికి గుర్తు చేసింది. భవిష్యత్తులో అధికారులు జర్నలిస్టులతో వ్యవహరించేటప్పుడు సంయమనం పాటించాలని, చట్టబద్ధమైన నిబంధనలను కచ్చితంగా అనుసరించేలా ప్రభుత్వం తగిన ఆదేశాలు జారీ చేయాలని గిల్డ్ తన లేఖలో డిమాండ్ చేసింది. మీడియా స్వేచ్ఛను కాపాడటం ద్వారానే పారదర్శకమైన పాలన సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఎడిటర్స్ గిల్డ్ నొక్కి చెప్పింది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!