NTV జర్నలిస్టుల అక్రమ అరెస్టులపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ( EGI ) ఆందోళన
- NTV జర్నలిస్టుల అరెస్టులపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన
- ఇద్దరు జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని ఖండించిన ఎడిటర్స్ గిల్డ్
- పోలీసులు అనవసరమైన తొందర చూపారని అభిప్రాయపడ్డ గిల్డ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసిన తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని అత్యున్నత మీడియా సంస్థ అయిన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (EGI) ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. ఫేక్ న్యూస్ ప్రచారం చేశారనే అభియోగాలతో ఎన్టీవీకి చెందిన ఇద్దరు జర్నలిస్టులను అర్ధరాత్రి వేళ హడావుడిగా అరెస్టు చేసిన విధానాన్ని గిల్డ్ తీవ్రంగా ఖండించింది. ఈ అరెస్టుల విషయంలో పోలీసులు తీవ్రమైన అత్యుత్సాహం ప్రదర్శించారని, కోర్టు బెయిల్ మంజూరు చేసే వరకు వారిని లాకప్లో ఉంచడం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది.
PM Modi: ‘‘మహా జంగిల్ రాజ్’’.. మమతా బెనర్జీ పాలనపై ప్రధాని మోడీ ఫైర్..
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
ముఖ్యంగా ఒక ఐఏఎస్ అధికారి బదిలీకి సంబంధించిన వార్త ప్రచురించినందుకు జర్నలిస్టులపై ఇలాంటి దూకుడు చర్యలకు పాల్పడటం మీడియా స్వేచ్ఛను అణచివేయడమేనని గిల్డ్ తన లేఖలో ఘాటుగా విమర్శించింది. ఈ అరెస్టులకు ముందు పోలీసులు కనీస న్యాయ ప్రక్రియను పాటించలేదని, సమగ్ర దర్యాప్తు జరిపిన తర్వాతే చర్యలు తీసుకోవాల్సిందని ఎడిటర్స్ గిల్డ్ అభిప్రాయపడింది. ఇలాంటి అధికార దుర్వినియోగం వల్ల స్వతంత్రంగా పనిచేసే మీడియా సంస్థల్లో భయాందోళనలు నెలకొంటాయని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హెచ్చరించింది.
తెలంగాణలో మీడియా ప్రతినిధులు ఎటువంటి అడ్డంకులు లేకుండా, స్వేచ్ఛగా తమ బాధ్యతలు నిర్వహించేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రికి గుర్తు చేసింది. భవిష్యత్తులో అధికారులు జర్నలిస్టులతో వ్యవహరించేటప్పుడు సంయమనం పాటించాలని, చట్టబద్ధమైన నిబంధనలను కచ్చితంగా అనుసరించేలా ప్రభుత్వం తగిన ఆదేశాలు జారీ చేయాలని గిల్డ్ తన లేఖలో డిమాండ్ చేసింది. మీడియా స్వేచ్ఛను కాపాడటం ద్వారానే పారదర్శకమైన పాలన సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఎడిటర్స్ గిల్డ్ నొక్కి చెప్పింది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!