TSPSC Paper Leak: నేడు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను విచారించనున్న ఈడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC Paper Leak: TSPSC పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను చంచలగూడా జైల్లో ఈడీ విచారించనుంది. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలతో ఈడీ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించి నిందితులను విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకోవాలని కోరిన విషయం తెలిసిందే. కాగా.. నాంపల్లి కోర్టు ప్రవీణ్, రాజశేఖర్ లను విచారించడానికి అనుమతించింది. ఇవాల ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించనున్నారు అధికారులు. నిందితుల తరపు న్యాయవాది సమక్షంలో విచారించాలని ఈడీకి నాంపల్లి కోర్టు ఆదేశించింది. జైలుకు ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్, మొబైల్స్ లను నాంపల్లి కోర్టు అనుమతించింది. జైలు సూపర్ డెంట్ కు ఈడీ అధికారులకు వసతులు ఏర్పాటు చేయాలనీ కోర్టు ఆదేశాలు జారీచేసింది. నలుగురు ఈడీ బృందం వెళ్లి విచారించడానికి అనుమతించింది. మనీ లాండరింగ్ కోణంలో ఇద్దరు నిందితులను ఈడీ విచారించనుంది. ఈరోజు, రేపు చంచలగూడ జైల్లోనే వాంగ్మూలం ఈడీ నమోదు చేయనుంది. ఈ కేసులో నిందుతుడు ప్రవీణ్ నుంచి తాజాగా మరికొన్ని వివరాలు రాబట్టేందుకు అనేక ప్రశ్నలను ఈడీ సంధిస్తోంది.
Read also: Rangareddy Crime: షాద్ నగర్ లో కిడ్నాప్.. గచ్చిబౌలిలో హత్య
Also Read
- AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
- Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్పైనే ఆశలు!
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గత నెల 23న మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఇడి అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17, 18 తేదీల్లో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను రెండు రోజుల పాటు కస్టడీకి ఈడీ అనుమతించింది. వీరిని చంచల్గూడ జైలులో అధికారులు విచారించనున్నారు. విచారణలో భాగంగా టీఎస్ పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మిని ఇప్పటికే ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించారు. అవసరమైతే మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని ఈడీ అధికారులు తెలిపారు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
-
Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
-
Imran Khan Gets Relief: ఇమ్రాన్ ఖాన్కు పాక్ కోర్టులో భారీ ఊరట..
-
Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంట్లో విషాదం.. మేనకోడలు ఆత్మహత్య
-
AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!