TSPSC Paper Leak: నేడు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను విచారించనున్న ఈడీ
TSPSC Paper Leak: TSPSC పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను చంచలగూడా జైల్లో ఈడీ విచారించనుంది. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలతో ఈడీ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించి నిందితులను విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకోవాలని కోరిన విషయం తెలిసిందే. కాగా.. నాంపల్లి కోర్టు ప్రవీణ్, రాజశేఖర్ లను విచారించడానికి అనుమతించింది. ఇవాల ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించనున్నారు అధికారులు. నిందితుల తరపు న్యాయవాది సమక్షంలో విచారించాలని ఈడీకి నాంపల్లి కోర్టు ఆదేశించింది. జైలుకు ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్, మొబైల్స్ లను నాంపల్లి కోర్టు అనుమతించింది. జైలు సూపర్ డెంట్ కు ఈడీ అధికారులకు వసతులు ఏర్పాటు చేయాలనీ కోర్టు ఆదేశాలు జారీచేసింది. నలుగురు ఈడీ బృందం వెళ్లి విచారించడానికి అనుమతించింది. మనీ లాండరింగ్ కోణంలో ఇద్దరు నిందితులను ఈడీ విచారించనుంది. ఈరోజు, రేపు చంచలగూడ జైల్లోనే వాంగ్మూలం ఈడీ నమోదు చేయనుంది. ఈ కేసులో నిందుతుడు ప్రవీణ్ నుంచి తాజాగా మరికొన్ని వివరాలు రాబట్టేందుకు అనేక ప్రశ్నలను ఈడీ సంధిస్తోంది.
Read also: Rangareddy Crime: షాద్ నగర్ లో కిడ్నాప్.. గచ్చిబౌలిలో హత్య
Also Read
- Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గత నెల 23న మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఇడి అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17, 18 తేదీల్లో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను రెండు రోజుల పాటు కస్టడీకి ఈడీ అనుమతించింది. వీరిని చంచల్గూడ జైలులో అధికారులు విచారించనున్నారు. విచారణలో భాగంగా టీఎస్ పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మిని ఇప్పటికే ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించారు. అవసరమైతే మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని ఈడీ అధికారులు తెలిపారు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
-
Jana Nayagan: ఎన్నికల ఆఫీసులో పైరసీ సినిమా.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!
-
Faria Abdullah: అమ్మ హిందూ.. నాన్న ముస్లిం.. కానీ అసలైన ట్విస్ట్ ఇదే!
-
Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో