Telangana DSC: తెలంగాణలో ముగిసిన డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ..
- తెలంగాణ ఉపాధ్యాయ పోస్టుల డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది...
- డీఎస్సీ పరీక్షకు మొత్తం 2
- 79
- 956 దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana DSC: తెలంగాణ ఉపాధ్యాయ పోస్టుల డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. డీఎస్సీ పరీక్షకు మొత్తం 2,79,956 దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొత్తం 11,062 పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. డీఈడీ, బీఈడీ పూర్తిచేసి టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) మరియు స్కూల్ అసిస్టెంట్ (SA) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. బీఈడీ పూర్తి చేసిన వారు టెట్లో ఉత్తీర్ణులైతే స్కూల్ అసిస్టెంట్లో రెండు మెథడాలజీ సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దాని ప్రకారం ఒక్కో అభ్యర్థి రెండు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకుంటే డీఎస్సీకి పోటీపడే అభ్యర్థుల సంఖ్య 2 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.
Read also: Italy Water Crisis : ఇటలీలో తీవ్ర నీటికొరత… దయచేసి పర్యాటకులు తమ దేశానికి రావొద్దని విజ్ఞప్తి
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
ఆ లెక్కన ఒక్కో పోస్టుకు దాదాపు 25 మంది పోటీ పడుతున్నారు. హైదరాబాద్ జిల్లా నుంచి 27,027 దరఖాస్తులు రాగా, నల్గొండ నుంచి 15,610 దరఖాస్తులు వచ్చాయి. 5శాతం స్థానికేతర కోటా ఉండడంతో ఇతర జిల్లాల వారు కూడా హైదరాబాద్ జిల్లాకు దరఖాస్తు చేసుకున్నారు. పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చినట్లు అంచనా. మేడ్చల్ జిల్లా నుంచి 2,265 మంది మాత్రమే వచ్చారు. ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి 2,828 దరఖాస్తులు వచ్చాయి. డీఎస్సీకి ఉచితంగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడంతో టెట్లో అర్హత సాధించిన వారిలో 23,919 మంది ఫీజు చెల్లించకుండానే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. జూలై 17 నుంచి 31 వరకు ఆన్లైన్లో డీఎస్సీ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే.పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్లు విడుదలయ్యే అవకాశం ఉంది.
Aravind Kejriwal : 8కిలోల బరువు తగ్గిన కేజ్రీవాల్.. ఆందోళన వ్యక్తం చేసిన ఆప్
తాజావార్తలు
-
New Smartphones: స్మూత్ డిస్ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..
-
Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
-
Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
-
Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్పై యోగి బుల్డోజర్ యాక్షన్..
-
Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!