Miyapur: మియాపూర్ లో ప్రభుత్వ భూములు.. తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు..
- మియాపూర్ ప్రభుత్వ భూముల పై తప్పుడు ప్రచారం..
- మీటింగ్ ఏర్పాటు చేసి రెచ్చగొట్టేలా స్పీచ్ లు..
- సంగీత- సీత- సంతోష్ తోపాటు మరో ఏడుగురి పై కేసులు..
- ప్రస్తుతం పరారీలో నిందితులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Miyapur: మియాపూర్ ప్రభుత్వ భూముల పై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు సంగీత, సీత అనే మహిళ చాలామంది మహిళలను రెచ్చగొట్టారని దర్యాప్తులో వెల్లడికావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సంగీత అనే మహిళ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందామని రెచ్చగొట్టినట్లు గుర్తించారు. స్థానిక ఫంక్షన్ హాల్స్ లో మీటింగ్ ఏర్పాటు చేసి రెచ్చగొట్టేలా స్పీచ్ లు ఇవ్వడంతో ప్రజలు సంగీత మాటలను నమ్మి భూములకై బయలు దేరినట్లు సమాచారం. అమాయక ప్రజలను ఆశరాగా తీసుకుని భూములు మావే నంటూ ప్రసంగాలు ఇచ్చిన పది మంది పై కేసులు నమోదు చేసిన పోలీసులు. సంగీత, సీత, సంతోష్ తోపాటు మరో ఏడుగురి పై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ భూముల్లో పాగా వేసి పోలీసుల పై రాళ్లు రువ్విన వారిపై కూడా కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
Read also: Crime News : బీమా సొమ్ము కోసం బావమరిది హత్య..
Also Read
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
నిన్న మియాపూర్ దీప్తిశ్రీనగర్లో ఉద్రిక్తత నెలకొంది. శేరిలింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని 100, 101 సర్వే నంబర్లలో దాదాపు 504 ఎకరాల హెచ్ఎండీఏ భూమి ఉంది. గుడిసెలు వేసుకుని మూడు, నాలుగు రోజులుగా అక్కడే ఉంటున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఇంటి స్థలాలు మంజూరు చేస్తుందని స్థానికంగా ప్రచారం సాగింది. దీంతో పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దాదాపు 2 వేల మంది గుడిసెలు వేసుకున్నారు. వాటిని తొలగించేందుకు అధికారులు ప్రయత్నించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ భూములిచ్చేది లేదని ప్రజలు భీష్మించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గుడిసెలు తీసేది లేదని హెచ్ఎండీఏ అధికారులు హెచ్చరించారు. దీంతో అక్కడున్న పోలీసులపై కొందరు రాల్లు విసిరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో ప్రభుత్వ భూమి అని తెలియక 16 మంది కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ భూమి ప్రభుత్వానిదేనని కోర్టు నిర్ధారించి హెచ్ఎండీఏకు అప్పగించింది. కొందరు కొనుగోలుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మరికొందరు సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ భూములను లాక్కోవాలని చూస్తున్నారని అధికారులు ఆరోపించారు.
Ganja Smuggling: గంజాయి, డ్రగ్స్ కట్టడికి యాక్షనులోకి దిగిన సీఎం..
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..