Dasoju Sravan : సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు.!
- బీఆర్ఎస్ దిమ్మెలను టీడీపీ నాయకులు కూలగొట్టాలని పిలుపునిచ్చారు
- ఇరుపార్టీల మధ్య గొడవలకు రేవంత్ వ్యాఖ్యలు దారితీస్తున్నాయి
- ముక్కలవుతారు అని మాట్లాడిన తలసానిపై కేసు పెట్టారు
- మరి కేసీఆర్ను బొంద పెట్టాలని మాట్లాడిన రేవంత్పై కూడా కేసు పెట్టాలి. -దాసోజు శ్రవణ్
తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన ప్రసంగాలు సాగుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ను కలిసి ముఖ్యమంత్రిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను “100 అడుగుల భూమిలోకి తొక్కిపెట్టాలి” అని రేవంత్ రెడ్డి మాట్లాడటంపై శ్రవణ్ మండిపడ్డారు. తెలంగాణ సాధించిన నాయకుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ దౌర్జన్యమని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
Ratha Saptami Celebrations : రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతున్న తిరుమల
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- TIMS Sanathnagar: సనత్నగర్ వాసులకు శుభవార్త.. శుక్రవారం నుంచి టిమ్స్లో వైద్య సేవలు ప్రారంభం..!
నోటికి హద్దులు లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీని కూల్చేస్తానని, బీఆర్ఎస్ దిమ్మెలను టీడీపి నాయకులు కూలగొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం ఇరు పార్టీల మధ్య గొడవలకు దారితీస్తోందని శ్రవణ్ ఆరోపించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కూడా ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేయలేక, ప్రజల దృష్టిని మళ్లించడానికే రేవంత్ రెడ్డి ఇటువంటి ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని ఆరోపించారు.
సికింద్రాబాద్ అస్థిత్వంపై ప్రశ్నించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై కేసులు పెట్టినప్పుడు, మరి కేసీఆర్ను బొందపెడతామన్న ముఖ్యమంత్రిపై ఎందుకు కేసులు పెట్టరని శ్రవణ్ ప్రశ్నించారు. తలసానిపై ప్రయోగించిన అదే సెక్షన్లను రేవంత్ రెడ్డిపై కూడా వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు చేస్తూ.. “ఆయన శరీరం కాంగ్రెస్ది, కానీ ఆత్మ మాత్రం టీడీపీది” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసుతో తెలంగాణలో టీడీపీ పతనానికి రేవంత్ రెడ్డే బీజం వేశారని, ఇప్పుడు బీజేపీ-టీడీపితో చీకటి రాజకీయాలు చేస్తూ తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. 1200 మంది అమరుల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేడు తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం తగదని హెచ్చరించారు.
యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ బీస్ట్ గా రాబోతున్న iQOO 15 Ultra.. లాంచ్ ఎప్పుడంటే..?
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!