Danam Nagender: బీఆర్ఎస్ కు మరో షాక్.. దానం నాగేందర్ గుడ్ బై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Danam Nagender: బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి సమక్షంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానం నాగేందర్కు కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఖరారు చేసింది. కాగా, బీఆర్ఎస్ను ఖాళీ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. తాజాగా రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, యాదయ్య కలిశారు. అలాగే ఇటీవల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో మల్కాజిగిరి, మేడ్చల్ ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. రంజిత్ రెడ్డిని చేవెళ్ల పార్లమెంట్ నుంచి, పట్నం సునీతారెడ్డిని మల్కాజిగిరి నుంచి పోటీకి దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం.
Read also: Revanth Reddy: ఇన్నాళ్లు సీఎంగా చూశారు.. ఇవాల్టి నుంచి పీసీసీ చీఫ్ గా నేనేంటో చూస్తారు..!
Also Read
ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దానం.. ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్లో చేరారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పోటీ చేసినప్పటికీ ఆయన రాజకీయ గురువు పీజేఆర్ తనయ బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అయితే దానం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండటంతో.. ఓడిపోయిన చోటే వెతుక్కోవాలని, మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాగేందర్పై కూడా భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. మరో మాజీ మంత్రి మల్లారెడ్డి రేవంత్ రెడ్డికి అరేయ్ రేవంత్ కు దమ్ముందారా అంటూ సవాల్ విసిరిన విషయం తెలిసిందే.. కాగా.. నిన్న కర్ణాటక డిప్యూటి సీఎం డి. శివకుమార్ ను కలిసారు. అయితే.. ఒకటి రెండు రోజుల్లో అతను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లారెడ్డిని రానీయకుండా అడ్డుకుంటున్నారని కీలక సమాచారం. కాగా.. ఇప్పటికే మల్లారెడ్డి అల్లుడు, మల్లారెడ్డి విద్యాసంస్థలు ఆక్రమంగా భూ కబ్జాలు చేసి చర్యలకు రేవంత్ సర్కారు ఉపక్రమించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికైతే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన మొలైంది. ఇక నెక్ట్ మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరుతారనే వార్తలు వస్తున్నాయి. ఇవాళ బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు నేతలు కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ లో టెన్షన్ షురూ అయ్యింది.
Bhoomi Shetty: ఇన్స్టాలో ఫొటోలు షేర్ చేస్తే.. నల్లగా ఉన్నానని కామెంట్స్ చేస్తున్నారు: హీరోయిన్
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!